ఒమిక్రాన్ : తెలంగాణ‌లో రెండు కేసులు.. ఎక్క‌డంటే..?

N ANJANEYULU
ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ తాజాగా తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట‌ర్ అయింది. ఇటీవ‌ల క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, ఢిల్లీ, పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కేసులు న‌మోదు అయిన విష‌యం విధిత‌మే. తాజాగా తెలంగాణ‌లో రెండు కేసులు న‌మోదు అయిన‌ట్టు డీహెచ్ శ్రీ‌నివాస‌రావు తెలిపారు.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్ట‌మొద‌టిసారిగా రెండు పాజిటివ్ కేసులు వ‌చ్చాయ‌ని వెల్ల‌డించారు. డిసెంబ‌ర్ 12న శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్‌లో నిర్వ‌హించిన కొవిడ్‌-19 ప‌రీక్ష‌ల‌లో కోవిడ్ రావ‌డంతో ఆ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపిచ‌గా నిర్థార‌ణ అయింది. న‌గ‌రంలోని టోలిచౌకిలో నివాసం ఉండే మ‌హిళ‌(24) డిసెంబ‌ర్ 12న  కెన్యా నుంచి శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌కు వ‌చ్చారు. అక్క‌డ ప‌రీక్ష‌లునిర్వ‌హించి.. జీనోమ్ సీక్వెన్ పంపించాం. ఆమెకు తాజాగా ఒమిక్రాన్ పాజిటివ్ వ‌చ్చింది. ఆమెకు కాంట్రాక్టు అయిన ఇద్ద‌రు వ్య‌క్తులకు సంబంధించిన శాంపిల్స్‌ను జీనోమ్‌ పంపించిన‌ట్టు  తెలిపారు డీహెచ్‌.
మ‌రొక వ్య‌క్తి సోమాలియా దేశం నుంచి 23 సంవ‌త్స‌రాల అబ్దుల్లా అహ్మ‌ద్ అనే వ్య‌క్తికి కూడా ఒమిక్రాన్ సోకింది. ఇత‌ను కూడా టోలిచౌకిలోనే నివాసం ఉండ‌డం గ‌మ‌నార్హం. ప‌శ్చిమ‌బెంగాల్‌కు సంబంధించిన మ‌రొక బాలుడికి ఒమిక్రాన్ సోకింది. ఒమిక్రాన్‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని డీహెచ్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: