కళా 'మా' తల్లి: బాలకృష్ణను పావుగా వాడారే?
మా ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణను పావుగా వాడారనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. మా అధ్యక్షుడిగా పోటీచేసిన విష్ణు ఎన్నికలకు ముందు బాలయ్యను కలిశారు. ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేశారు. తనకు మద్దతు తెలియజేస్తున్నట్లు, ఓటేస్తున్నట్లు విష్ణు ప్రకటించారు. దీనిపై బాలకృష్ణ స్పందించలేదు. ఎటువంటి ఖండన ఇవ్వలేదు. దీంతో సహజంగానే అందరూ మద్దతిస్తున్నారనుకున్నారు. ఎన్నికల తర్వాత మోహన్బాబు, విష్ణు ఇద్దరూ వెళ్లి మళ్లీ బాలకృష్ణను కలిశారు. మాలో జరుగుతున్న గొడవలపై చర్చించామన్నారు. నందమూరి బాలకృష్ణకు ఉన్నది ఉన్నట్లు మాట్లాడటమేకానీ రాజకీయాలు చేయడం తెలవదనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎదుటివారి రాజకీయానికి ఇప్పుడు ఆయన బలయ్యారు. ఏపీ రాజకీయవర్గాల్లో కమ్మ-కాపుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి రాబోయే ఎన్నికల్లో పవన్-చంద్రబాబు కలవకుండా నిరోధించడానికి ఈ పరిణామాలు జరుగుతున్నాయి. మంచు విష్ణు జగన్కు బావమరిది అవుతారు. ఈ కోణంలో వారి వారి రాజకీయాల కోసం బాలయ్యను పావుగా వాడారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీనికి బాలకృష్ణ ఏమంటారో?