37 ఏళ్ళ కల... నీరజ్ విజయంతో పిటి ఉష ఎమోషనల్

Chaganti
టోక్యో 2020 లో శనివారం భారతదేశంలో తొలి ఒలింపిక్ ట్రాక్, జావెలిన్‌లో నీరజ్ చోప్రాను స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. అత్యంత ప్రసిద్ధ స్ప్రింటర్లలో ఒకరైన పిటి ఉష నీరజ్ ను అభినందించారు. ఉష నీరజ్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి "37 సంవత్సరాల తర్వాత ఈ రోజు నా కల సాకారం అయ్యింది. థ్యాంక్ యూ మై సన్ నీరజ్ చోప్రా #టోక్యో 2020" అంటూ ట్వీట్ చేశారు. 'పయ్యోలి ఎక్స్‌ప్రెస్' అని పిలవబడే ఉష 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్య పతకాన్ని 1/100 వ సెకనులో కోల్పోయింది. ఉషను భారతీయ అథ్లెటిక్స్ గోల్డ్ గర్ల్ గా పిలిచినప్పటికీ ఒలింపిక్ పతకం ఆమె నెరవేరని కలగా మిగిలిపోయింది. 1984 ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో ఆమె కాంస్య పతకాన్ని 55.42 సెకన్లలో మిస్ చేసుకుంది. దీంతో ఆమె నాల్గవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఉన్న క్రీడాకారులు ఒలంపిక్ ఛాంపియన్‌ గా నిలవాలనే ఆశతో బాలుస్సేరీ (కేరళ)లోని ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్‌ ను పిటీ ఉష నడుపుతోంది. అందులో పలువురు ప్రతిభావంతమైన క్రీడాకారులను తీరిదిద్దుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: