టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మరోసారి సిఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు. కోవిడ్ బాధితులను ఆదుకోవడం మానేసి ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. అంతే కాకుండా కాకినాడలో కోవిడ్ బాధితుల ఆవేధనను వీడియో రూపంలో బయటపెట్టారు. ట్విట్టర్ లో ఆయన స్పందిస్తూ " కరోనా పేషెంట్లకు కనీసవైద్యసేవలు అందడంలేదని కాకినాడ ఆస్పత్రిలో దయనీయ దృశ్యాలు చూసైనా మానవత్వంతో స్పందించండి. అని మానవత్వంతో ట్వీట్ చేసినందుకు నాపై ఫేక్ కేసులు పెట్టించారు. ఆస్పత్రిలో పరిస్థితులు చక్కదిద్దేందుకు ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు.
కాకినాడ రమణయ్యపేట ప్రాంతానికి చెందిన వలంటీర్ లక్ష్మి ఏడు నెలల గర్భిణి. ఆమెకు కోవిడ్ సోకి కాకినాడ ప్రభుత్వ ఆసత్ప్రిలో చేరారు. తనకు వైద్యం అందడంలేదని సెల్ఫీ వీడియోలో వేడుకున్నారు. కలెక్టర్ ఆదేశించినా వైద్యం అందక ఆమెతోపాటు కడుపులో బిడ్డ కూడా కన్నుమూసింది. వలంటీర్తోపాటు ఆమె కడుపులో ఉన్న పసిగుడ్డు మరణానికి మీ చేతకాని పాలన కారణం కాదా? ఇప్పటికైనా తాడేపల్లి కొంపలో కూర్చుని ప్రతిపక్షంపై ఎలా తప్పుడు కేసులు పెట్టాలనే కుతంత్రాలు మానేసి,ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలనే దానిపై సమీక్షలు చేయండి మూర్ఖపు ముఖ్యమంత్రి గారూ! " అంటూ ఘాటుగా నారా లోకేష్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.