ఆరు గ్యాస్ సిలిండర్లు పేలి..భారీ అగ్ని ప్రమాదం !!
దాంతో పక్కనే ఉన్న ఆరు పూరి గుడిసెలకు మంటలు వ్యాపించాయి. దీంతో గుడిసెలో ఉన్న ఒక వృద్దురాలు మంటలలో సజీవ దహనం అయ్యింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఎగసి పడుతున్న మంటలను ఆర్పడం జరిగింది. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనలో చనిపోయిన వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు..