భారత్ - చైనా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఫ్తీ..!
జమ్ముకశ్మీర్లో దేశంలోని ఎవరైనా భూములు కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తూ.. భూచట్టాల్లో మార్పులు చేయటంపై గురువారం ఉదయం ఆందోళన చేపట్టింది పీడీపీ. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు కార్యకర్తలు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఆందోళనకారులను అడ్డుకున్నాయి. శ్రీనగర్లోని పీడీపీ కార్యాలయాన్ని మూసివేసి.. పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు.