మాజోడి ఎప్పటికీ కొత్త రికార్డు : రాజ్నాథ్ సింగ్
భగల్పుర్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజ్నాథ్... విపక్షాలపై విరుచుకుపడ్డారు. లాంతరు(ఆర్జేడీ ఎన్నికల గుర్తు) పగిలిపోయిందని, ఇప్పుడు అది పనిచేయదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 15 ఏళ్ల ఆర్జేడీ పాలన, నితీశ్ కుమార్ నేతృత్వంలోని కూటమి పాలన మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారన్నారు. దశాబ్దాల పాటు తాగునీరు, విద్యుత్, రహదారుల లేమితో సతమతమవుతున్న బిహార్ ప్రజలకు తమ ప్రభుత్వం కనీస అవసరాలన్నింటినీ అందించిందని తెలిపారు.