విశాఖ రైల్వే స్టేషన్ లో అలజడి...!

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని పెంచే అవకాశం ఉన్న నేపధ్యంలో ఇప్పుడు వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్ళడానికి సిద్దమవుతున్నారు. సొంత రాష్ట్రాలకు వెళ్ళడానికి గానూ ఇప్పుడు భారీగా బారులు తీరుతున్నారు. రైల్వే స్టేషన్ ల వద్ద ఇప్పుడు వారి హడావుడి ఎక్కువగా ఉంది. 

 

ఇక తాజాగా విశాఖ రైల్వే స్టేషన్ వద్ద అలజడి మొదలయింది. విశాఖ రైల్వే స్టేషన్ లో ఝార్ఖండ్ వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్ళడానికి బారులు తీరారు. తమను సొంత ఊర్లకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర సర్కార్ భారీగా వలస కార్మికులను తరలించడానికి గానూ ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతుంది. దీనితో వలస కూలీలు వెళ్ళిపోవడానికి రైల్వే స్టేషన్ కి వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: