బజాజ్ చేతక్ కొత్త లుక్ మాములుగా లేదుగా?

Purushottham Vinay
బజాజ్ చేతక్ తన అప్ డేటెడ్ వెర్షన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతకు ముందు 2020 వ సంవత్సరంలో ఆ కంపెనీ ఈ-స్కూటర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి ఫీచర్లు యాడ్ చేస్తూ  కంపెనీ తాజాగా ఓ మోడల్ తీసుకువచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక బజాజ్‌ ఆటో.. చేతక్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 2023 ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. మూడు కలర్లలో లభించనున్న ఈ ప్రీమియం ఈవీ ధర వచ్చేసి బెంగళూరు ఎక్స్‌షోరూం ప్రకారం రూ.1,51,910 ఉంటుంది.ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న చేతక్‌ ధర రూ.1,21,933గా ఉంది.ఇక సరికొత్త ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా ఈ ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను బజాజ్‌ ఆటో కంపెనీ తీసుకొచ్చింది.ఇక బజాజ్ కంపెనీ ఈ కొత్త వేరియంట్ ని మొత్తం మూడు కలర్ ఆప్షన్స్ లో రిలీజ్ చేసింది. అవి మాట్ కోర్స్ గ్రే, మాట్ కరేబియన్ బ్లూ ఇంకా శాటిన్ బ్లాక్ కలర్స్. ఇంకా అంతే కాకుండా ఈ స్కూటర్ డ్యూయెల్ టోన్ సీటు అలాగే బాడీ కలర్ రియర్ వ్యూ మిర్రర్స్, శాటిన్ బ్లాక్ గ్రాబ్ రైల్, మ్యాచింగ్ పిలియన్ ఫుట్ రెస్ట్ కాస్టింగ్స్ ఇంకా హెడ్ ల్యాంప్ కేసింగ్ అలాగే బ్లింకర్లు వంటివి కూడా ఉన్నాయి.


ఇక మన దేశంలో ఈ కొత్త బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. అయితే డెలివరీలు 2023 ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.ఇక బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ డిజైన్, ఫీచర్స్ అప్డేట్ పొందినప్పటికీ బ్యాటరీ ప్యాక్ ఇంకా అలాగే పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎలాంటి అప్డేట్ లేదు. అందువల్ల ఇందులో అదే 2.9 కిలోవాట్ బ్యాటరీ అనేది ఉంటుంది. ఇది 4.2కిలోవాట్ల పీక్ వర్ ని ప్రొడ్యూస్ చేస్తోంది.దీన్ని ఒక సారి చార్జ్ చేస్తే మొత్తం 90 కిలోమీటర్ల మైలేజ్ని ఇస్తుంది. అయితే ఇటీవల చేతక్ ప్రకటించిన విధంగా ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ లో స్కూటర్ మైలేజీని మొత్తం 20 శాతం మేర పెంచి 108 కిలోమీటర్లకు చేర్చితే ఇది ఓలా స్కూటర్ కు పోటీ కాగలదని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: