చెన్నై వేదికగా రెనాల్ట్‌, నిస్సాన్‌ నుంచి కొత్త మోడల్స్?

Purushottham Vinay
చెన్నై వేదికగా రెనాల్ట్‌, నిస్సాన్‌ నుంచి కొత్త మోడల్స్.. ?
ఈ మధ్యనే ఒక్కటైన రెండు కార్ల తయారీ కంపెనీలు రెనాల్ట్‌, నిస్సాన్‌ ఇక తమ ఫస్ట్‌ జాయింట్‌ ప్రాజెక్ట్‌ వివరాలను వెల్లడించడం జరిగింది. భారత్ లో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికను కూడా ఈ కంపెనీలు ప్రకటించాయి. ఇక ఇందులో భాగంగా మొత్తం 600 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో చెన్నైలోని మ్యానిఫ్యాక్షరింగ్‌ ప్లాంట్‌ని కూడా డీకార్బనైజ్‌ చేయనున్నాయి.కొత్త మోడల్‌ కార్ల తయారీ ద్వారా దాదాపు 2 వేల మందికి ఉద్యోగాలు కూడా ఈ కంపెనీలు ఇవ్వనున్నాయి. ఈ రెండు కంపెనీలు కలిసి మొత్తం ఆరు కొత్త వాహనాలను ఉత్పత్తి చేయనున్నాయి. ఇందులో భాగంగా రెండు ఎలక్ట్రిక్ కార్లను ఇంకా నాలుగు SUVలను డిజైన్ చేస్తాయి. ఇక మన దేశంలోని వినియోగదారులతోపాటు దక్షిణాసియా దేశాలు ఇంకా అలాగే ఇతర విదేశాలకు ఎగుమతులు లక్ష్యంగా కూడా ఈ వెహికిల్స్‌ని ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకురానున్నాయి.

ఇంకా ఈ రెండు కంపెనీలు కూడా చెరో మూడు చొప్పున ఏకంగా ఆరు వాహనాలను డిజైన్ చేసి ఉత్పత్తి చేయనున్నాయి. చెన్నైలోని కార్ల తయారీ ప్లాంట్‌ని 2045 నాటికి కార్బన్‌ న్యూట్రల్‌గా ఇవి తీర్చిదిద్దుతాయి. ఇదిలా ఉంటే .. ఈ రెండు కంపెనీలు విలీనమయ్యేందుకు ఏర్పాటుచేసుకున్న ఒప్పందం ప్రకారం.. నిస్సాన్‌ కంపెనీలోని వాటాను రెనాల్ట్‌ కంపెనీ భారీగా తగ్గించుకోనుంది.గతంలో మొత్తం 43 శాతం షేరును కలిగి ఉండగా భవిష్యత్తులో 15 శాతంతో కంపెనీ సరిపెట్టుకోనుంది. ఇక దీనికి ప్రతి ఫలంగా నిస్సాన్.. ఇక రెనాల్ట్ కంపెనీ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ యూనిట్‌లో పెట్టుబడులు పెట్టనుంది.ఇంకా   ఈ మేరకు సోమవారం నాడు ఉమ్మడిగా ప్రకటన చేశాయి. రెనాల్ట్‌ ఇంకా నిస్సాన్‌ వెల్లడించిన ఈ ఫస్ట్‌ జాయింట్‌ ప్రాజెక్టు ఇండియాలోనే కాకుండా గ్లోబల్‌ మోటర్‌ సెక్టార్‌లో కూడా కీలకమైన పరిణామంగా ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: