హ్యుందాయ్ క్రెటా : ఎయిర్ బ్యాగ్స్ ఫెయిల్.. కంపెనీకి జరిమానా!

Purushottham Vinay
ఇక కొరియన్ కార్ కంపెనీ అయిన హ్యుందాయ్ దేశీయ మార్కెట్లో అమ్ముతున్న క్రెటా ఎస్‌యూవీ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రస్తుతం, దేశంలో కెల్లా చాలా ఎక్కువగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీలలో క్రెటా నెంబర్ వన్ స్థానంలో ఉంది. అలాంటి క్రెటా ఎస్‌యూవీలో ఇప్పుడు ఓ పెద్ద సమస్య ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. తాజాగా, జరిగిన ఓ సంఘటన క్రెటా సేఫ్టీ వ్యవస్థను ప్రశ్నించేలా ఉంది. ఇక దానికి సంబంధించిన ఆ వివరాలేంటో చూద్దాం.ఇక సాధారణంగా, ప్రయాణీకుల సేఫ్టీ కోసం కారులో ఎయిర్‌బ్యాగ్‌ లను ఫిక్స్ చేస్తారు. కానీ, ప్రమాదం జరిగినప్పుడు కనుక ఇవి ఫెయిల్ అయితే మాత్రం అసలు కారులో ఈ సేఫ్టీ ఫీచర్ ఉండి ప్రయోజనం ఏముంటుంది అసలు. ఇక ఢిల్లీకి చెందిన ఓ హ్యుందాయ్ క్రెటా యజమాని తన కారుకి ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ కాలేదని దేశపు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో కేసు వేశాడు. ఈ కేసులో నిజానిజాలను పరిశీలించిన కోర్టు ఆ సదరు క్రెటా యజమానికి నష్టపరిహారంగా రూ.3 లక్షలు చెల్లించాలని కంపెనీ ఆదేశించడం జరిగింది.ఇక ఢిల్లీకి చెందిన శైలేందర్ భట్నాగర్ ఆగస్టు 21, 2015వ తేదీన ఓ హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ కార్ ని కొనుగోలు చేశాడు. భట్నాగర్ నడుపుతున్న హ్యుందాయ్ క్రెటా కార్ నవంబర్ 16, 2017వ తేదీన దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురైంది. ఢిల్లీలోని పానిపట్ హైవేపై ఈ ప్రమాదం అనేది జరిగింది.


ఇక యాక్సిడెంట్ జరిగిన సమయంలో క్రెటా నడుపుతున్న పిటిషనర్ (శైలేందర్ భట్నాగర్) తల, ముఖం ఇంకా అలాగే ఛాతీ ప్రాంతాల్లో గాయాలయ్యాయి. ఈ సమయంలో క్రెటాలోని ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కాలేదు. ఇక దాని కారణంగా అతనికి గాయలైనట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.ఇక తన క్రెటాలో అమర్చిన ఎయిర్‌బ్యాగ్‌ లు ఫెయిల్ అయినందున భట్నాగర్ హ్యుందాయ్‌ కంపెనీపై కోర్టులో వాజ్యం వేశాడు. ఆయన ముందుగా తన సమస్యను ఢిల్లీ స్టేట్ కన్స్యూమర్ రిడ్రెసల్ కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చాడు. ఢిల్లీ స్టేట్ కన్స్యూమర్ రిడ్రెసల్ కమిషన్ భట్నాగర్‌ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇంకా అలాగే వైద్య ఖర్చులు ఇంకా ఆస్తి నష్టానికి గాను రూ. 2 లక్షలు, వ్యాజ్యం కోసం రూ. 50,000 ఇంకా అలాగే క్రాష్ కారణంగా మానసిక వేదనకు గురైనందుకు మరో రూ. 50,000 చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: