డ్యూయెల్ టోన్ కలర్‌లో బజాజ్ డామినార్ 250.. ధర, వివరాలు..

Purushottham Vinay
ఇక ఫేమస్ బైక్ అండ్ స్కూటర్ కంపెనీ బజాజ్ ఆటో ఇప్పుడు భారత మార్కెట్లో తన డామినార్ 250 కొత్త స్పెషల్ డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్‌ను విడుదల చేయడం జరిగింది.ఇక ఇండియా మార్కెట్లో విడుదలైన ఈ కొత్త డామినార్ 250 బైక్ ధర వచ్చేసి రూ. 1,54,176 (ఎక్స్-షోరూమ్)గా వుంది. ఇక దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.ఇక ఇండియా మార్కెట్లో ఇప్పటికే బాగా పాపులర్ అయిన డామినార్ 250 బైక్ ఇప్పుడు కొత్త డ్యూయెల్ కలర్ వేరియంట్లలో మనకు అందుబాటులో ఉంటుంది. కొత్త డామినార్ 250 డ్యూయల్-టోన్ వేరియంట్‌ను కంపెనీ దాని స్టాండర్డ్ వేరియంట్‌తో సమానమైన ధరలో విడుదల చేయడం జరిగింది.ఇక బజాజ్ ఆటో తన ఫేమస్ టూరింగ్ బైక్ బజాజ్ డామినార్ 250 డ్యూయల్ టోన్ వేరియంట్‌ను ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్‌లలో విడుదల చేయడం జరిగింది.

 
ఇక ఇందులో రేసింగ్ రెడ్ అండ్ మ్యాట్ సిల్వర్, సిట్రస్ రష్ ఇంకా మ్యాట్ సిల్వర్ అలాగే స్పార్కింగ్ బ్లాక్ అండ్ మ్యాట్ సిల్వర్ కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి.ఇక నివేదికల ప్రకారం చూసినట్లయితే కంపెనీ తన కొత్త బజాజ్ డామినార్ 250 మోడల్ ని మార్కెట్లో మరింత విస్తరించేందుకు ఈ స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఇక బజాజ్ కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త కలర్ బైకులలో కొత్త కలర్ ఆప్షన్స్ తప్పా, మిగిలిన ఎలాంటి మార్పులు అనేవి జరగలేదు.ఇక ఈ కొత్త కలర్ బైకులలో కూడా దాని స్టాండర్డ్ వేరియంట్ బైక్ లోని ఇంజిన్ అమర్చడం జరిగింది. బజాజ్ ఆటో లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ ఆర్యన్ సుందరరామన్ కొత్త డ్యూయల్ టోన్ బజాజ్ డామినార్ 250 ని ప్రారంభించడం జరిగింది. ఇక ఇవి చూడటానికి మునుపటికంటే కూడా చాలా అందంగా ఇంకా ఆకర్షణీయంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: