నిస్సాన్ నుంచి వచ్చిన కిక్స్ ఎస్‌యూవీపై భారీ ఆఫర్లు.

Satvika
కరోనా మహమ్మారి కారణంగా ఎందరో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. ఇక కొన్ని వ్యాపార సంస్థలు అయితే పూర్తిగా మూసి వేసే పరిస్థితి నెలకొంది.తయారైన వస్తువులను కొనుగోలు చేసేందుకు మార్కెట్ లేక పోవడంతో ఇలాంటి పరిస్థి తీ ఏర్పడింది. ఇక కార్ల అమ్మకాలు అయితే చెప్పనక్కర్లేదు..భారీగానే బిజినెస్ పడిపోయింది. కరోనా కారణంగా సేల్స్ బాగా డౌన్ అయ్యాయి. దీంతో సేల్స్ పెంచుకోవడానికి కొన్ని సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. నిస్సాన్ నుంచి వచ్చిన కిక్స్ ఎస్‌యూవీపై ఆ సంస్థ భారీ ఆఫర్లను ప్రకటించింది.

ఈ నెలాఖరు వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు ఈ వాహనంపై తగ్గింపులు ఉంటాయని నిస్సాన్ వెల్లడించింది. కిక్స్ ఎస్‌యూవీ కొనుగోలుపై కస్టమర్లు క్యాష్ డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్ వంటి ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. ఈ సంస్థ ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్ఐసి ఆఫర్ ను కూడా అందిస్తుంది. ఆ ఆఫర్ల పై పూర్తి వివరాలను కంపెనీ వెబ్ సైట్ లో పొందుపరిచింది. కిక్స్ ఎస్‌యూవీ కొనుగోలుపై కస్టమర్లు రూ.95,000 వరకు లబ్ధి పొందవచ్చు. దీంట్లో రూ.25,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.50 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 లాయల్టీ బోనస్ ఉంటుంది. ఈ లాయల్టీ బోనస్‌ను సంస్థ ఎడిషనల్ ఎక్స్ఛేంజ్ బోనస్‌గా అందిస్తోంది.

కిక్స్ ఎస్‌యూవీని XL, XV, XV ప్రీమియం, XV ప్రీమియం వంటి నాలుగు ట్రిమ్‌ లెవల్స్‌లో మార్కెట్లోకి విడుదల చేశారు. ఏప్రిల్ ఒకటి నుంచి పెరగనున్న ధరలు కిక్స్ ఎస్‌యూవీ వేరియంట్లు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్ అందుబాటులో ఉంది. ఇక మార్కెట్ లో ఈ కారు విలువ విషయానికొస్తే ..రూ.9.49 లక్షల నుంచి రూ.14.64 లక్షల వరకు ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాహనాలతో నిస్సాన్ కిక్స్ పోటీ పడుతోంది. నిస్సాన్ ఇటీవల అన్ని మోడళ్లపై ధరలు పెంచింది.. ఆ రేట్లు కూడా వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. కిక్స్ అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ తెగ ప్రయత్నిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: