టీవీఎస్ అపాచీ నుంచి మరొక బైక్ లాంచ్.. ధర మాములుగా లేదుగా..

Satvika
ప్రముఖ టీవీఎస్ కంపెనీ ఎన్నో రకాల ద్విచక్ర వాహనాలను అందుబాటులో కి తీసుకొచ్చింది.. మార్కెట్ లోకి ఇప్పటివరకు వచ్చిన వాహనాలలో అన్నీ కూడా ది బెస్ట్ అనే టాక్ ను అందుకున్నాయి. ఈ ఏడాదిలో నెలకు ఒక బండిని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇప్పుడు కూడా యువత కళ్లు చెదిరే బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. అత్యుత్తమ బైక్స్ ను విడుదల చేస్తో వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ సంస్థ నుంచి అపాచీ మోడల్ ఎంతో విజయం సాధించింది. తాజాగా ఈ మోడల్ కు సంబంధించిన 2021 వర్షన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది టీవీఎస్.


అదే అపాచీ ఆర్టీఆర్ 160 4వీ. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చేసి రూ.1.07 లక్షలుగా నిర్దేశించింది. గత మోడల్ తో పోలిస్తే ఈ మోటార్ సైకిల్ వేరియంట్ల ధరలను కాస్త పెంచింది. రెండు మోడళ్లలో దాదాపు రూ.3000ల ధరను పెంచింది. అంతేకాకుండా వీటిలో కొన్ని కీలక మార్పులు, అప్డేట్లను కూడా చేసింది టీవీఎస్. బరువు 2 కేజీలు తగ్గించింది. ఇప్పుడు అపాచీ ఆర్టీఆర్ 160 4వీ డ్రమ్ వేరియంట్ 145 కేజీల ఉండగా, డిస్క్ వేరియంట్ మాత్రం 145 కేజీలు బరువు ఉంటుంది.


ఈ సరికొత్త టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మోటార్ సైకిల్లో ఆల్ న్యూ డ్యూయల్ టోన్ సీటుతో కూడిన కార్బర్ ఫైబర్ ప్యాటర్న్ ను పొందుపరిచారు. అంతేకాకుండా క్లా షీల్డుతో కూడిన ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు ఇందులో అదనపు ఆకర్షణ. ఈ మోటార్ సైకిల్లో మూడు పెయింట్ స్కీములు ఉన్నాయి. రేసింగ్ రెడ్, నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ లాంటి కలర్స్ లో ఈ బైక్ అందుబాటులో ఉంది. 150 నుంచి 160సీసీ సిగ్మెంట్లో భారత్ లో ఈ ఏడాదిలోనే అత్యంత శక్తిమంతమైన బైక్ గా గుర్తింపు తెచ్చుకుంది. భారత మార్కెట్లో ఈ మోటార్ సైకిల్ కు పోటీగా బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160, సుజుకీ జిక్సెర్ 155 లాంటి వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: