ఈ ట్రాక్టర్ కు డీజిల్ అవసరం లేదట.. ఎలా నడుస్తుందంటే..?

Satvika
ఎటువంటి వాహనానికి అయిన కూడా డీజిల్ లేదా పెట్రోల్ తో నడుస్తాయి. అయితే మరి కొన్ని వాహనాలు గ్యాస్ తో నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు ట్రాక్టర్ డీజిల్ లేకుండానే నడుస్తుందట.. రైతులకు ఈ ట్రాక్టర్ బాగా ఉపయోగపడుతుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.. రైతులకు ట్రాక్టర్‌కు విడదీయరాని సంబంధముంది. వ్యవసాయానికి సంబంధించి ఏం పని చేయాలన్న ట్రాక్టర్ తప్పనిసరి. దుక్కి దున్నింది మొదలు.. విత్తనాలు వేయడం, పంట కోయడం, ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించడం వరకు.. అన్నింటా ట్రాక్టరే కీలక పాత్ర పోషిస్తుంది. 



అయితే, ప్రస్తుతం మార్కెట్లో డీజిల్‌తో నడిచే ట్రాక్టర్లే ఉన్నాయి. పెరుగుతున్న ధరలతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలోనే రైతుల ఖర్చును తగ్గించే సరికొత్త ట్రాక్టర్‌ వచ్చేసింది. తొలి సీఎన్జీ ట్రాక్టర్‌ను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఆవిష్కరించారు. రామట్ టెక్నో సొల్యూషన్స్, టొమాసెటో అచిల్లీ ఇండియా సంస్థలు సంయుక్తంగా ఈ ట్రాక్టర్‌ను రూపొందించాయి.ఈ ట్రాక్టర్‌తో ప్రధానంగా మూడు లాభాలున్నాయి. దీనికి డీజిల్‌తో నడిచే ట్రాక్టర్‌తో సమానంగా లేదా అంత కంటే ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. డీజిల్ ఇంజిన్‌తో పోల్చితే 70 శాతం తక్కువ ఉద్గారాలు విడుదలవుతాయి. ముఖ్యంగా రైతులకు ట్రాక్టర్‌పై పెట్టే ఖర్చులో 50శాతం తగ్గుతుంది. ఎందుకంటే ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ. 80 రూపాయలు ఉంది. 



ఇక కిలో సీఎన్జీ ధర రూ.42 మాత్రమే. ఈ ట్రాక్టర్‌తో ఖర్చు తగ్గడంతో పాటు పర్యావణానికి కూడా ఎక్కువగా హాని జరగదు.అంతేకాదు ఇందులో ఎటువంటి హానికర పదార్థాలను లేవు.. అయితే డీజిల్‌ ఇంజిన్‌తో పోల్చితే సీఎన్జీ ఇంజిన్‌ ఎక్కువ మన్నికైనది. చాలా కాలం వరకు ఇంజిన్ పాడవదు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. ప్రస్తుతం మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు కాలుష్యం కూడా పెరుగుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఇలాంటి ఆలోచన చేస్తున్నాయి.రానున్న రోజుల్లో చాలా కంపెనీలు ఇలాంటి వాహనాలను పూర్తిగా అందుబాటులోకి తీసుకు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: