తెలుగమ్మాయి 'అంజలి' దశ తిరిగేనా ?

VAMSI
అచ్చతెలుగు గోదావరి అమ్మాయి అంజలి గురించి అందరికి తెలిసిన విషయమే.. అయితే ఆమె కోలీవుడ్ లో సత్తా చాటి అక్కడ పదుల సంఖ్యలో చిత్రాలు చేస్తూ సక్సెస్ అయ్యాక తెలుగు దర్శకులు, హీరోలు ఆమెను పట్టించుకుని రవితేజ , బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్స్ ఆఫర్స్ ఇచ్చారు. అయితే అంజలి చెన్నైలో డిగ్రీ పూర్తి చేసి నటనపై మక్కువతో షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. అయితే 2006లో విడుదలైన 'ఫోటో' అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ పై కూడా ఫోకస్ పెట్టడమే కాకుండా అనూహ్యంగా అక్కడ సక్సెస్ అయ్యారు.
షాపింగ్ మాల్, జర్నీ లాంటి సినిమాలు తెలుగులో సక్సెస్ అవ్వటంతో అంజలికి ఇక్కడ మంచి గుర్తింపు వచ్చింది . అయితే తన కెరీర్లో ఆమెకు దక్కిన అతిపెద్ద ఆఫర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమాలో గోదావరి యాస, భాష తెలిసిన నటిగా సీత పాత్రకు న్యాయం చేయటమే కాకుండా  వెంకటేష్ కి జంటగా అంజలి అద్భుతంగా చేశారు.
అటు తర్వాత రవితేజ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించి బలుపు మూవీ మంచి విజయం అందుకుంది. ఈ మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది అంజలి. అంతే కాకుండా మసాలా, గీతాంజలి ఇలా తెలుగులో వరుస ఆఫర్స్ రావటంతో పాటు, పవన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ వకీల్ సాబ్ చిత్రంలో కూడా అంజలి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
కాగా అంజలి ఇప్పుడు బైరాగి అనే కన్నడ చిత్రంతోపాటు 'నయట్టు' తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. అయితే కెరీర్ ఇలా మూవీస్ తో బిజీగా ఉండగా సోషల్ మీడియాలో కూడా అల్లాడిస్తు క్యూట్ క్యూట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారు. కాగా కొంచెం అవకాశాలు తగ్గిన అంజలి మళ్ళీ తన లేటెస్ట్ ఫిలిమ్స్ తో ఆకట్టుకుని టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారుతుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: