మాజీ మిస్ ఇండియా జీవితాన్ని నాశనం చేసిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ?
రేపో మాపో పెళ్లి కూడా చేసుకుంటారని అంతా అనుకున్నారు. అలాంటిది అనూహ్యంగా వీరి మధ్య మనస్పర్ధలు వచ్చి బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. లియాండర్ పేస్ తనపై కపట ప్రేమను కురిపించి తనని మోసం చేశాడని అప్పట్లో చాలా ఆరోపణలు చేశారు నటి మహిమ. అప్పటి వరకు తనే ప్రపంచం అన్న లియాండర్ మరో అమ్మాయి దొరకడంతో తనని వదిలి ఆ అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. లియాండర్ ఫేస్ మంచి ఆటగాడే.. కానీ నాతో ఫెయిర్ గేమ్ ఆడలేదు అంటూ మోడల్ రియా తో ఎఫైర్ పెట్టుకుని తనని మోసం చేశారు అని చెప్పుకొచ్చింది. అయితే అదే ఆవేదనలో మునిగిపోయిన మహిమ తన సినీ జీవితంపై దృష్టి కేంద్రీకరించలేక అక్కడ కూడా సమస్యలను ఎదుర్కొన్నారు అనే చెప్పాలి.
అప్పట్లో ఫుల్ ఫామ్ లో ఉన్న ఆమె అలా అనూహ్యంగా అనతికాలంలోనే ఫేడవుట్ అయిపోయారు. ఇందుకు తన బ్రేకప్ కారణమని అన్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఇక కొద్ది రోజుల తరవాత 2006లో బిజినెస్మేన్ అయిన బాబీ ముఖర్జీని వివాహం చేసుకుంది. వీరికి అరియానా అనే అమ్మాయి కూడా ఉంది. అయితే వీరి మధ్య కూడా మనస్పర్ధలు తలెత్తడంతో 2011లోనే విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే లియాండర్ జీవితం కూడా అలానే అయ్యింది అంటూ తెలిపింది. తనను కాదని ఫేస్ రియా ను పెళ్లి చేసుకున్న లియాండర్ పేస్ ఆమెకు తో కూడా విడిపోయి ఇప్పుడు హీరోయిన్ కిమ్శర్మతో డేటింగ్లో ఉన్నాడంటూ...ఇలా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు లియాండర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. కాగా ప్రస్తుతం తన టీనేజ్ కూతురు అరియానాతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు మహిమ చౌదరి.