డేంజర్ జోన్ లో ఆ స్టార్ హీరోయిన్ కెరీర్... నిర్మాతలు ముందుకు వస్తారా ?

VAMSI
టాలీవుడ్ లో హీరోయిన్ గా పూజ హెగ్డే ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తనకు బ్లాక్ బస్టర్ ఇవ్వకపోయినా మరో సినిమా చేసి అవకాశాన్ని మాత్రం ఇచ్చింది. అయితే ఆ తర్వాత చేసిన దువ్వాడ జగన్నాధం, అరవింద సమేత వీర రాఘవ మరియు "అల వైకుంఠపురములో" లాంటి చిత్రాలలో నటించిన హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది. దీనితో ఒక్కసారిగా తన పేరు సినిమా ఇండస్ట్రీ అంతా మారుమ్రోగిపోయింది. అలా వరుసగా తనకు అవకాశాలు చుట్టుముట్టాయి. అయితే పూజ హెగ్డే మాత్రం కథలను ఎంచుకోవడంలో తడబడినట్లు అనిపించింది. కట్ చేస్తే ఇప్పుడు తన కెరీర్ ప్రమాదంలో ఉంది.
ముందుగా టాలీవుడ్ రెబల్ స్టార్ మరియు పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ తో ఒక అద్భుతమైన లవ్ స్టోరీకి సైన్ చేసింది. కానీ ఈ సినిమాను సరిగా టేకింగ్ చేయడంలో విఫలం అయిన జిల్ ఫేమ్ రాధాకృష్ణన్ అటు ప్రభాస్ కు ఇటు పూజ హెగ్డే కెరీర్ లో ప్లాప్ మూవీని అందించారు. అయితే కెరీర్ అన్నాక హిట్ ప్లాప్ లు సహజమే అని సర్దుకు పోయింది పూజ హెగ్డే. అయితే గత నెలలో పూజ హెగ్డే తమిళ హీరో విజయ్ కలిసి నటించిన బీస్ట్ చిత్రం ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ రొటీన్ కథ, స్క్రీన్ ప్లే లోపం తో అంచనాలను అందుకోలేక చతికిలపడింది. ఇలా వరుసగా రెండు సినిమాలు నిరాశను మిగిల్చాయి.
ఇప్పుడు ఆ సంఖ్యకు మూడుకు చేరింది... లేటెస్ట్ గా రిలీజ్ అయిన మెగాస్టార్ సినిమా ఆచార్య మొదటి రోజు నుండే ప్లాప్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ ల కోసం నానా కష్టాలు పడుతోంది. దీనితో హ్యాట్రిక్ విజయాల తర్వాత... హ్యాట్రిక్ పరాజయాలు పూజ హెగ్డే కెరీర్ ను డేంజర్ జోన్ లోకి పడేశాయి. ఇప్పుడు ఆల్రెడీ ఈమెతో సినిమాలను ఒప్పుకున్న వారు కూడా భయపడుతున్నారు. అయితే ఇక ముందు ఈమెతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: