జయసుధ రెండవ పెళ్లికి దారి తీసిన కష్టాలు ఇవే?

VAMSI
సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. అయితే సినిమా రంగంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఆనాడు ఉన్న పరిస్థితులకు చాలా తేడా ఉంది. అప్పట్లో హీరోలకు ఎంత ప్రాధాన్యం అయితే ఉండేదో, హీరోయిన్ లకు కూడా అంతే ప్రాధాన్యం ఉండేది. హీరోలకు ధీటుగా నటిస్తూ మంచి పేరును సంపాదించుకున్నారు. అలాంటి వారిలో సావిత్రి, జామున, వాణిశ్రీ, జయప్రద, జయసుధ మరియు శ్రీదేవిలు ఉన్నారు. అయితే వీరిలో కేవలం ఒక్క జయసుధ మాత్రమే దాదాపుగా అందరి హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈమెకు ఆడవాళ్లు ఎక్కువగా ఫ్యాన్స్ ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారు కూడా, అయితే అప్పట్లో ఈమె రెండు పెళ్లిలా గురించి ఎంత రభస అయిందో అందరికీ తెలిసిందే. కానీ పూర్తి వివరాలు ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. అసలు ఏమి జరిగింది అనేది ఇపుడు చుద్దాం?
తాను హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ అనే ఒక వ్యాపారవేత్తను జయసుధ ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ జయసుధ ఇంట్లో వాళ్ళు అందుకు ససేమిరా అనడంతో చాలా మందికి లాగే వీరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్దీ రోజులు ఇంట్లో వాళ్ళు పిలిచి రిసెప్షన్ చేసి కలిసిపోయారు. అయితే పెళ్లయినా ఇద్దరూ తమ తమ ప్రొఫెషన్ లలో బిజీ అయిపోయారు. జయసుధ కూడా ఆ తర్వాత సినిమాలలో నటించి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అయితే ఈ మధ్యలో వీరి దాంపత్య జీవితంలో కొన్ని సమస్యల కారణంగా రోజూ రాజేంద్ర ప్రసాద్ జయసుధను వేధించే వాడట.

ఈ టార్చర్ భరించలేని జయసుధ చెన్నైకి వెళ్లిపోయిందట. కొంతకాలం విజయ వాహిని బ్యానర్ అధినేత నాగిరెడ్డి పంచన ఉంది. అయితే కొద్దీ రోజుల తర్వాత పెద్దవారు అంత కలిసి వీరిని కలిపే ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో ఇక విడిపోక తప్పలేదు. అయినా జయసుధ సినిమాలను వదిలింది లేదు. అప్పుడే నితిన్ కపూర్ తో పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. అలా జయసుధ తన జీవితంలో అన్ని కష్టాల అనంతరం రెండవ పెళ్లి చేసుకుంది. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన నటనా జీవితనాన్ని కొనసాగిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: