కంగనకు షాక్.. ఆ కేసులను రద్దు చేయలేం- బాంబే హైకోర్టు
ఈ కేసును విచారించాలని గత ఏడాది డిసెంబర్ లోనే హై కోర్టు పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కంగనా రనౌత్ కు సామన్లు జారీ చేసింది. కాగ జావేద్ అక్తర్ తన పై వేసిన పరువు నష్టం కేసును కొట్టివేయాలని ముంబై హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ తరపు న్యాయవాది రిజ్వాన్ సిద్ధఖీ ద్వారా ఈ పిటిషన్ ను వేసింది. తన పై ఉన్న పరువు నష్టం దావా కేసులను కొట్టి వేయాలని ఆ పిటిషన్ లో ముంబై హై కోర్టు ను కోరింది. కాగ కంగనా రనౌత్ వేసిన పిటిషన్ ముంబై హై కోర్టు విచారణ చేసింది. అయితే ఆ కేసులను ఇప్పుడు రద్దు చేయాలని బాంబే హై కోర్టు తెల్చి చేప్పింది.
కాగ ప్రస్తుతం కంగాన రనౌత్ తలైవి సినిమాలో నిటించింది. ఈ సినిమా రేపు అనగా శుక్రవారం తియెటర్లో రిలీజ్ కానుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజకీయ నాయకురాలు జయలలిత జీవితం ఆధారంగా ఈ తలైవి సినిమా విడుదల కానుంది.