పెన్నుతో ప్రపంచాన్ని మార్చగల మహిళలు..

Mamatha Reddy
ఎంత చేసినా, ఎంత చూసినా ఏదో ఒక చోట ఏదో ఒక మూలన మహిళలపై చిన్నచూపు ఇంకా ఉందని ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఎంతో మంది మహిళలు గొప్ప గొప్ప స్థానాలకు ఎదిగి తమపై ఉన్న ఆ భావాన్ని తుడిచిపెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది మగవారు కావాలని వారిని అణగదొక్కాలని చూస్తున్నారు. ముఖ్యంగా సాహిత్య, రచనా రంగంలో,జర్నలిజం లో మహిళలపై ఇప్పటికీ చిన్నచూపు ఉంది. జర్నలిజంలో, రచన విభాగంలో మహిళలు ఎంతో మంది గొప్ప గొప్ప రచయితలు గా ఉన్నారు.  అయితే వారిని ఎదగనీయకుండా కొంతమంది పనిగట్టుకొని వారిని తొక్కేస్తున్నారు అని చెప్పవచ్చు.

ఎన్నో బాధలను భరించి కష్టాలను ఓర్చుకుని పిల్లల్ని కనే ఓ మహిళ అంతకంటే ఎక్కువ బాధ ను అనుభవిస్తూ తమని తాము నిరూపించుకోవడానికి ఇప్పుడు సమాజంలో ఎంతో పోరాటం చేస్తుంది. అడుగడుగునా అవమానాలు అణువణువునా చిన్న చూపు భరిస్తూ కూడా ఎంతో మంది మహిళలు ఇప్పుడు గొప్ప స్థాయికి ఎదిగారు. చంద్రుని మీద అడుగు పెట్టిన దగ్గర్నుంచి విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకునే అంతవరకు ఎదిగారు మహిళలు. వీరికి తోడుగా కొంతమంది పురుషులు నిలవడంతో తాము ఈ ఘనతలు సాధించాలన కొన్ని సందర్భాలలో కొంత మంది మహిళలు చెప్పారు.

ఇక మహిళల అణచివేతను ఒకసారి గమనిస్తే ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ ను ఏ విధంగా చంపేశారో మనందరం చూసాము. టోక్యో ఒలంపిక్స్ లో మహిళలకే ఎక్కువగా పతకాలు లభిస్తుండడం వారి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు ఒక పౌరుడికి జన్మనివ్వాలన్న, పౌరుడినీ తీర్చిదిద్దాలన్నా అది ఒక మహిళ కు మాత్రమే సాధ్యం అలాంటి మహిళకు ఇంకా ఎన్నాళ్ళు ఈ అవమానాలు. తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లు ఓ మహిళ కడుపును చీల్చుకుంటూ జన్మనిచ్చి అదే మహిళను అవమానాలకు గురిచేయడం వీరికి ఎంత వరకు సమంజసం. ఓ మహిళ తలచుకుంటే ఏదైనా చేయగలదు. అలా రచన విభాగంలో ఎంతోమంది మహిళలు తమ పెన్నుతో గొప్ప గొప్ప విన్యాసాలు చేసి చూపించారు. కదనరంగంలో కూడా చివరి నెత్తుటి బొట్టు వరకు పోరాడి వీరమరణం పొందిన మహిళలు ఎంతోమంది ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: