కేర‌ళ లో 100% అక్ష‌రాస్య‌త‌ కు కారణం ఈ మహిళా ..అసలు కథ ఇదే..//

Mamatha Reddy
ప్రపంచ దేశాల్లోని చాలా దేశాల్లో ప్రధాన సమస్య ఏది అంటే నిరక్షరాస్యత. చదువుకోని వారు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రభావం దేశం పై పడి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. అలా నిరక్షరాస్యత ప్రభావితం చూపుతున్న దేశాలలో ఒకటి భారతదేశం. భారతదేశంలో చాలా రాష్ట్రాలలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కూడా ఈ శాతాన్ని తగ్గించుకోలేకపోతుంది భారతీయ ప్రభుత్వం. ఇప్పుడిప్పుడే చదువు పట్ల ప్రజలకు అవగాహన రావడంతో వారి పిల్లలను చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు.
ముఖ్యంగా కేరళలో ఈ రకమైన విప్లవం ఎప్పుడో వచ్చింది కనుక ఇప్పుడు దేశంలోనే అక్షరాస్యత మెరుగ్గా ఉన్న రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో అక్షరాస్యత విషయంలో కేరళ నెంబర్ వన్ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. దేశంలోనే కేరళలో అక్షరాస్యత రేటు ఎక్కువ. ఆ రాష్ట్రంలో నూటికి నూరు శాతం మంది అక్షరాస్యులు ఉన్నారు. అక్కడ చదువుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు ఇతర రాష్ట్రాలలో పోలిస్తే విద్యారంగంలో కేరళ నెంబర్ వన్ స్థానంలో ఎప్పటినుంచో కొనసాగుతోంది. అయితే ఆ రాష్ట్రం ఘనతను సాధించడానికి అసలు కారణం ఏమిటి అంటే..
కేరళలో 1817 సంవత్సరంలో అప్పటి మహారాణి శ్రీ పద్మనాభసేవిని వంచి ధర్మ వర్దిని రాజా రాజేశ్వరి మహారాణి తిరుణాల్ గౌరీ పార్వతి భాయి ఓ అధికారిక ప్రకటన చేసింది. అప్పట్లో ట్రావెన్ కోర్ లో ఆమె కొలువు దీరింది. ఈ క్రమంలో ఆమె అందరికీ విద్య అందాలన్న ఉద్దేశంతో రాజ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం కేరళలో విద్యారంగానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ఆ రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. అలాగే పౌరులకు విద్యను అందించడంలో వెనుకడుగు వేయకూడదు. విద్య వల్ల జనాలకు అనేక అంశాలపై అవగాహన వస్తుంది. వారు ప్రజాసేవకులుగా మారుతారు. రాష్ట్రం పురోగతి సాధిస్తుంది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అనే విధంగా ఆలోచించి మహారాణి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మెరుగ్గా తయారయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: