ఆటిజంపై ప‌రిశోధ‌న‌లు.. స్పెష‌ల్‌గా నిలుస్తున్న శ్రీజారెడ్డి..!

Mamatha Reddy
ఒక స‌మ‌స్య తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు సాధార‌ణంగా దానిని ప‌రిష్క‌రించేందుకు కృషి చేయ‌డం అంద‌రూ చేసేదే. దీనినే పెద్ద‌గా ప్ర‌చారం చేసుకుంటారు. అయితే.. ఆ స‌మ‌స్య ప‌రిష్కారం చేయ‌డంతోపాటు.. ఈ స‌మ‌స్య వెనుక ఉండే మూలాలు ఏమిటి?  ఎందుకు ఈ స‌మ‌స్య వ‌స్తోంది?  ఇది రాకుండా చేయ‌లేమా? అనే త‌ప‌న ప‌డే వ్య‌క్తులు.. చాలా త‌క్కువ‌మంది ఉంటారు. ఇలా.. త‌న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుక్కోవ‌డ‌మే కాకుండా.. స‌ద‌రు స‌మ‌స్య మూలాల‌ను అధ్య‌య‌నం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు.. శ్రీజారెడ్డి.

శ్రీజారెడ్డి.. పినాకిల్ బ్లూమ్స్ వ్య‌వస్థాప‌కురాలు. ఆమె త‌న‌దైన వ్య‌క్తిత్వంతో.. పేద‌ల‌కు.. స‌మాజంలో ఆటిజంతో ఇబ్బంది ప‌డుతున్న చిన్నారుల‌కు సేవ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆటిజం అనేది చిన్నారుల్లో త‌లె త్తే ప్ర‌ధాన స‌మ స్య‌. అంద‌రి పిల్ల‌ల్లా కాకుండా.. వీరిలో ప్ర‌త్యేక‌మైన‌.. వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఇవి భౌతికంగా పైకి క‌నిపించ‌క‌పోయినా.. మాన‌సికంగా వారిని వేధిస్తాయి. దీంతో ఎదుగుద‌ల‌ లో లోపాలు.. మాట్లాడ‌డంలో లోపాలు వంటివి క‌నిపిస్తాయి.
అదే స‌మ‌యంలో ఆహారం తీసుకోవ‌డంలో లోపాలు.. మెచ్యూరిటీ లేక పోవ‌డం వంటివి క‌నిపిస్తాయి. ఇలాంటి వాటికి ప‌రిష్కారాల‌ను చూపించేందుకు శ్రీజారెడ్డి పినాకిల్ బ్లూమ్స్ అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. అయితే.. ఆమె అక్క‌డితో ఆగిపోలేదు. అస‌లు ఈ స‌మ‌స్య ఎందుకు వ‌స్తుంది?  ఎలా వ‌స్తుంది?  మేన‌రిక సంబంధాలు కార‌ణ‌మా?  లేక జ‌న్యు లోపాలా?   వంటి అనేక స‌మ‌స్య‌ల పై అధ్య‌యనం, ప‌రిశోధ‌న‌లు సాగిస్తున్నారు. తిరుప‌తిలోని శ్రీవేంక‌టేశ్వ‌ర మెడిక‌ల్ ఇనిస్టిట్యూట్‌, హార్వార్డ్ హెల్త్ ఇనిస్టిట్యూట్‌తో క‌లిసి ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.
ఈ క్ర‌మంలోనే ఆమె చిన్న‌పిల్ల‌ల్లో వ‌చ్చే మానసిక‌, బుద్ధి మాంద్యం స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పినాకిల్ బ్లూమ్స్ బ్రాంచ్‌ లు ఏర్పాటు చేసి 1500 మంది ఈ త‌ర‌హా పిల్ల‌ల‌కు థెర‌పీలు ఇచ్చి వారిని మూములుగా తీర్చిదిద్దుతూ స‌క్సెస్ అవుతున్నారు.

" >


" >


" >

" >

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: