ప్రతి రోజు కుటుంబం కోసం ఈమె పడుతున్న కష్టం తెలిస్తే.. ?

Mamatha Reddy
మొదటి దశ కరోనా వల్ల దేశ ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతింది. ఈ కరోనా వల్ల జరిగిన ఆర్ధిక నష్టం నుంచి దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ కోలుకోలేదు. అయితే మొదటి దశ నుంచి కోలుకోకుండానే ఈలోగా కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ ప్రజలను కష్టాల్లోకి నెట్టడాటనికి వచ్చేసింది.ఈ కరోనా వైరస్ ప్రభావంతో దేశంలోను ప్రపంచంలోను ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో మా అందరికి తెలిసిందే. లౌక్ డౌన్ వలన ఒక్క రంగం అని కాకుండా... అన్ని రంగాలు బాగా దెబ్బతిన్నాయి. మళ్లీ అంతా సెట్ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది.

ఈ సమయంలో  ఓ మహిళ జొమాటో సంస్థలో ఫుడ్ డెలివరీ వర్కర్ లా పనిచేస్తుంది.. చెన్నై లో నివసిస్తున్న ఈమె అలా ఎందుకు చేయవలసి వచ్చింది , ఆమె భర్త ఏం చేస్తున్నాడు అనే ఆలోచన మీకు రావచ్చు.. పదేళ్ల కిందట ఆమె భర్త కాలం చేశారట.. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు.. ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచి, తన బైక్ పై 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రికెట్ కోచింగ్ సెంటర్ లో తన కుమారుని విడిచి పెట్టి , తిరిగి ఇంటికి వచ్చి తన పని చూసుకుని మధ్యాహ్నం 12 తర్వాత ఆమె డ్యూటీకి రిపోర్ట్ చేస్తుంది..

అలా ఆమె రాత్రి 11 గంటల వరకు ఫుడ్ డెలివరీ చేస్తూ సుమారుగా రోజుకి 25 వరకు డెలివరీ చేసి డబ్బు సంపాదిస్తుంది.. రోజు దాదాపుగా 250 నుంచి 300 కిలోమీటర్లు బైక్ పై తిరుగుతూ ఆ తర్వాత ఇంటికి వచ్చి నిద్ర పోతుంది ఇది ఆమె రోజు వారి దినచర్య.. రోజంతా పని చేసి కేవలం ఐదు గంటల పాటు మాత్రమే ఆమె విషయం తీసుకుంటుంది.. ఇంత తీవ్రంగా శ్రమిస్తుంది కాబట్టే ఆమె జొమాటో లో డైమండ్ స్టార్ అవార్డు గెలుచుకుంది.. డెలివరీ విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా ఎంతో గౌరవంగా కస్టమర్లతో మాట్లాడుతూ బెస్ట్ ఫుడ్ డెలివరీ వర్కర్ గా గుర్తింపు పొందింది.. ఆమె పడుతున్న శ్రమ, అంకితభావం కి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: