అప్పుడు దిశ .. ఇప్పుడు చెన్నమ్మ..సేమ్ తో సేమ్

DRK Raju
దిశ ఘటన నుంచి తేరుకోక ముందే సరిగ్గా అలాంటి దుర్ఘటన మరొకటి జరిగింది. ఈ సంఘటన కూడా  తెలంగాణాలో చోటు చేసుకోవడం గమనార్హం. ఈ సారి వంటిపై నగలు ఉన్న పాపానికి హత్యకి గురికావాల్సి వచ్చింది. వికారాబాద్ జిల్లా బంటారం మండలం బొప్పనరం గ్రామ శివారులో మహిళా దారుణ హత్య గురయింది. నాగర్ కర్నూల్ కు చెందిన చెన్నమ్మ అనే 28 సంవత్సరాల వివాహిత గత కొన్ని రోజులుగా చేవెళ్లలో జీవనోపాధి కోసం వచ్చి రోజువారి కూలి చేసుకుని జీవనం కొనసాగిస్తుంది.  

బంట్వారం మండలం బొపునాపురం గ్రామానికి చెందిన రాజు, భార్య అనీలతో కలిసి కొన్నాళ్ల క్రితం ఉపాధి కోసం చేవెళ్ల వలస వచ్చాడు. వీరికి చెన్నమ్మ పరిచయమైంది. రాజు దంపతులు ఇటీవల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో అడ్డదారులు తొక్కి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వారి కన్ను చెన్నమ్మపై పడింది.

చెన్నమ్మ దగ్గర భారీగా ఆభరణాలు ఉన్నాయని తెలుసుకున్న రాజు, అనిలా వాటిని దోచుకోవాలనుకున్నారు. 20 రోజుల క్రితం చెన్నమ్మకు మాయమాటలు చెప్పిన రాజు ఆమెను బొపునారం గ్రామ శివారుకి బైక్‌పై తీసుకెళ్లాడు. అక్కడ ముగ్గురు కలిసి మద్యం తాగారు. పథకం ప్రకారం భార్యభర్తలకు చెన్నమ్మకు మద్యం ఎక్కువగా తాగించారు. ఆమె మత్తులోకి జారుకోగానే గొంతు నులిమి చంపేసి పొదల్లో శవాన్ని పడేసి తగులబెట్టాడు రాజు.

చెన్నమ్మ కనిపించక పోయేసరికి ఆమె తమ్ముడి ఫిర్యాదు మేరకు చేవెళ్ల పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. దర్యాప్తులో భాగంగా రాజు అతడి భార్యపై అనుమానంతో అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన స్టైల్లో విచారించంగా "మేమె చెన్నమ్మను బంగారం కోసం చంపేసాము" అని ఒప్పుకున్నారు. దాంతో ఈరోజు బొపునారం గ్రామానికి వెళ్లి శవానికి పోస్టు మాస్టమ్ నిర్వహించారు చేవెళ్ల పోలీసులు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: