విజయం మీదే: మీరు ఈ రాశివారు అయితే ఆర్ధిక లాభాలు?
తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది తో మనకు కొత్త సంవత్సరం మొదలవుతుంది. కాగా ఈ నూతన సంవత్సరం ...2022 లో ఏప్రిల్ మాసంలో 29వ తేదీన కుంభ రాశిలోకి బదిలీ అవనున్నారు. అలాగే ఇదే రాశిలో 2022 సంవత్సరం జులై 11వ తేదీ వరకు సంచారం చేసి.. మరలా మకర రాశి లోకి తిరిగి రానున్నారు . అనంతరం 2023 జనవరి 18వ తేదీన మళ్లీ కుంభ రాశి లోకి ప్రవేశించనున్నారు. దీని కారణంగా శని ప్రభావం కూడా మారనుంది. తద్వారా కొన్ని రాశుల వారికి ఇది కలిసొచ్చి శనీశ్వరుని అనుగ్రహం పొందే అవకాశం ఉంది. శని అనగా కేవలం చెడు ప్రభావమే కాదు గ్రహ స్థానాలను బట్టి మంచి ప్రభావం కూడా చూపుతుంది.
ప్రధానంగా శని 3, 6, 7, 10వ స్థానాల్లో ఉండటం వలన శుభ ఫలితాలొస్తాయని శాస్త్రం చెబుతోంది. శని గ్రహ మార్పు కారణంగా ఈ ఏడాది కొన్ని రాశుల వారికి విజయం కోరి వరిస్తుంది, అనుకున్న ఫలితాలు అందుతాయి అని అంటున్నారు. ఆ రాశులు ఏవో ఇపుడు చూద్దాం. వృషభ రాశి, సింహ రాశి, కన్య రాశి, ధనస్సు రాశి వారికి శని దేవుని అనుగ్రహం ఉంటుందని ... ఈ రాశుల వారికి శుభ ఫలితాలు అందుతాయని, అనుకున్న కార్యాలు జరుగుతాయని, ముఖ్యంగా ఆర్ధిక పరమైన విషయాలు లాభదాయకంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ రాశుల వారు శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.