వైరల్: చిన్న డ్రాప్ చాలు.. కళ్ళ అద్దాలకు గుడ్ బై..!

Divya
చాలా మంది కంటి సైట్ వల్ల కళ్ళ అద్దాలను ఉపయోగిస్తూ ఉంటారు.. వీటివల్ల చాలా మంది ఇబ్బందులను కూడా ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా యువతి, యువకులు అద్దాలు ఉపయోగించడం నామూషిగా ఫీల్ అవుతూ ఉంటారు.మరి కొంతమందికి వయసు పెరిగే కొద్దీ కంటిచూపు తగ్గుతుందని చెప్పవచ్చు. దీనిని ప్రెస్బియోపీయా అని పిలుస్తారట. దాదాపుగా 109 నుంచి 180 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ఇటీవల ఒక నివేదికలో తెలియజేశారు. వీరందరూ కూడా 40 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్నవారే నట. అయితే ఇప్పుడు కళ్లద్దాలు ఇక అవసరం లేకుండా ఒక కొత్త ఐ డ్రాప్ మార్కెట్లోకి రాబోతోందట.

ముంబైకి చెందిన ఎనర్జీ ఫార్మన్ప్రికల్స్ కంపెనీ తయారుచేసిన ఐ డ్రాప్స్ కు ఇటీవల డిసిఐజి ఆమోదం తెలిపింది.. ఈ డ్రాప్స్ వల్ల ప్రిస్బియోపియా సమస్యతో ఉన్నవారికి దగ్గర వస్తువులను సరిగ్గా చూడలేరు. ఏదైనా చదవాలి అనుకుంటే కచ్చితంగా వీరికి కళ్లద్దాలు ఉండాల్సిందే.. ఈ సమస్యకు సైతం చికిత్స అందించేందుకు PRESVU ఐ డ్రాప్ ని సైతం తీసుకురావడం జరిగింది. వీటికి ఆమోదం కూడా సెంట్రల్ డ్రగ్స్ నుంచి పొందినట్లు తెలియజేశారు.

కొంతమంది డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ నిపుణులు సైతం సిఫార్సు చేసి మరి వీటికి అనుమతి ఇచ్చారట. ఈ ఐ డ్రాప్స్ వేసుకోవడం వల్ల కళ్లద్దాలు అవసరం లేకుండా తగ్గిస్తుందని ఈ సంస్థ తెలియజేస్తోంది దీని ధర కూడా కేవలం 350 రూపాయలకు మాత్రమే ఉంటుందని ఇది ఈ నెల మొదటి వారంలో లేకపోతే వచ్చే నెలలో ఖచ్చితంగా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చేలా ఫార్మా న్యూట్రికల్ కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు తెలియజేసింది. ఇటీవలే అందుకు సంబంధించిన ఒక ప్రకటనను కూడా తెలియజేయడంతో ఇకమీదట కళ్లద్దాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇక మీదట వాటి బెడద ఉండదని చెప్పవచ్చు. అది ఇది ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: