వైరల్: ఇంకా కనిపించని 3వ తరగతి బాలిక మృతదేహం.. కేసులో మరో ట్విస్ట్..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో పగిడ్యాల మండలంలో ఉండేటువంటి ఎల్లాల గ్రామంలో మూడవ తరగతి బాలికను.. ఏడవ తరగతి చదువుతున్న కొంతమంది బాలురు అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన గత మూడు రోజుల నుంచి ఎక్కువగా ఈ విషయం వైరల్ గా మారుతున్నది. జులై ఏడవ తేదీన ఆడుకోవడానికి స్నేహితులతో కలసి పార్కుకి వెళ్లిన.. మూడవ తరగతి బాలిక పార్కులో ఒంటరిగా ఆడుకుంటున్న పాపను చూసిన ముగ్గురు బాలురు వచ్చి.. కాలువ వద్దకు తీసుకువెళ్లి మరి అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే దొరికిపోతారేమో అని భయంతో ఆ బాలిక గొంతు నిలిపి ఏడవ తరగతి బాలురు చంపేశారట. అయితే తల్లిదండ్రుల ఫిర్యాదుల మేరకు పోలీసులు మొదట మిస్సింగ్ కేస్ నమోదు చేసి ఆ తర్వాత గాలిపు చర్యలు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే అనంతరం ఆ బాలురను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా మొదట కృష్ణ నదిలో పడివేసేమని చెప్పగా పోలీసులు గజ ఈతగాలని పిలిపించి మరీ వారి సహాయంతో ఆ బాలిక యొక్క మృతదేహం కోసం వెతికించారు. అప్పటికే ఈ బాలిక మరణించి ఐదు రోజులు అవుతోందట అయినా కూడా ఆచుకి దొరకడం లేదు.

ఈ క్రమంలో పోలీసులకు మరొకసారి అనుమానం వచ్చి ఆ ఏడవ తరగతి బాలురును మళ్లీ విచారించగా దీంతో నదిలో కాదని ఒకచోట పూడ్చి పెట్టామంటూ చెప్పారట.. దీంతో పగిడ్యాల మండలంలో ఉండే స్మశాన వాటికలో పూడ్చి పెట్టామని చెప్పగా పోలీసులు అక్కడికి వెళ్లి వెతికించక ఎక్కడ కూడా మృతదేహం లభించలేదట. అయితే నిందితులు ఎక్కడ పూడ్చిపెట్టారు కరెక్ట్ గా చెప్పడం లేదు లేకపోతే మరేదైనా విషయాన్ని దాస్తున్నారా అనే విషయం మాత్రం తెలియడం లేదని పోలీసులు తెలియజేస్తున్నారు. నిందితులు చూపించిన రెండు చోట్ల చెట్లను తొలగించి చూసినప్పటికీ బాలిక ఆచూకీ మాత్రం లభించలేదు. నిందితులను సైతం పోలీసులు మూసుకు వేసి తిప్పుతున్నట్టు తెలుస్తుంది. ఇలా రోజుకు ఒక ట్విస్టులతో ఈ కేసు రోజు ముందుకు సాగుతూనే ఉంది. ఇటీవలే ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: