బైక్ తో సహా వరదల్లో చిక్కుకున్నాడు.. అయినా అతనేం చేస్తున్నాడు చూడండి?

praveen
వర్షం పడిందంటే చాలు కొన్ని చోట్ల రైతన్నలు ఆనందంలో మునిగిపోతూ ఉంటారు. కానీ వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలు మాత్రం వర్షాకాలం వచ్చిందంటే చాలు దినదిన గండంగా బ్రతికేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎక్కడ భారీ వర్షాలు వస్తే జనజీవనం స్తంభించిపోయి ఇళ్లల్లోకి వరద నీరు చేరుతుందో అని ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బ్రతికేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే వర్షాకాలం మొదలైంది కొన్ని రాష్ట్రాలలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

 ఇక ఎప్పటిలాగానే వరదలతో కొన్ని ప్రాంతాలు అల్లాడిపోతున్నాయ్ . జనజీవనం మొత్తం స్తంభించిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ వరదల కారణంగా ఇలా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు కొన్ని కొన్ని సార్లు ఏకంగా బ్రిడ్జిలు ఉన్న ప్రాంతంలో వర్షపు నీరు బ్రిడ్జిపై నుంచి పొంగి పోరడు రావడం చూస్తూ ఉంటాం. అలాంటి సమయంలో వాహనదారులు అక్కడి వైపు వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కాస్త అతి చేస్తూ చివరికి వరద నీటిలో చిక్కుకోవడం లాంటి ఘటనలు కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి.

 ఇక ఇప్పుడు గుజరాత్ లో ఇలాంటి తరహా ఘటన జరిగింది. అక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఏకంగా బైక్ తో సహా వరదల్లో చిక్కుకుపోయాడు. ఒకవైపు వరద నీరు ఉధృతంగా ఉన్న సమయంలోనే ఎలాగోలా బైక్ తో సహా బ్రిడ్జి దాటాలనుకున్నాడు. కానీ మధ్యలోకి వెళ్ళేసరికే వరదల్లో చిక్కుకుపోయాడు. ఎటు వెళ్లలేను అన్న విషయం అతనికి అర్థమైంది . ఆ సమయంలో ఎక్కడ ప్రాణం పోతుందో అని భయపడకుండా అతను చక్కగా గుట్కాను చేతి మధ్యలో వేసి నులుస్తూ ఉన్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో అతన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: