ఉద్యోగులను దారుణంగా హింసిస్తున్న అమెజాన్?

Purushottham Vinay
కొన్ని కంపెనీలు తమ సంస్థలో పని చేసే వారిని బానిసలుగా భావిస్తుంటారు. అందుకే వారిపై బాగా పని ఒత్తిడి పెడుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెజాన్ ఇండియా కంపెనీ విషయంలో ఓ యువకుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అక్కడ ఉండే మేనెజర్లు తమకు టార్గెట్ పూరయ్యే దాకా వాష్ రూమ్, వాటర్ బ్రేక్ కూడా ఇవ్వరంటూవెల్లడించారు. హర్యానా రాష్ట్రంలోని మనేసర్ ప్రాంతంలో అమెజాన్ ఇండియా కు చెందిన ఐదు గిడ్డంగులనేవి ఉన్నాయి. ఇక్కడ చాలా మంది పని చేస్తున్నారు. వస్తువుల ఎగుమతి ఇంకా దిగుమతి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను సంపాదిస్తున్న డబ్బులు, అక్కడ పడుతున్న శ్రమ గురించి అతను చెప్పుకొచ్చాడు. మనేసర్ లో ఉన్న అమెజాన్ కి చెందిన ఐదు గిడ్డుంగుల్లో వారానికి ఐదు రోజులు పని చేయాలని, రోజుకు ఏకంగా 10 గంటల చెప్పున పని ఉంటుందని, ఫలితంగా నెలకు కేవలం రూ.10 వేల జీతం వస్తుందని ఆ యువకుడు వెల్లడించారు. ఇదే సమయంలో అక్కడ పనిచేసే సీనియర్లు కూడా బాగా ఇబ్బంది పెట్టే వారని పేర్కొన్నాడు. షిఫ్ట్ సమయంలో టైమ్ వేస్ట్ చేయకూడదని పైగా వాష్ రూమ్ లలో ఎవరైనా ఉంటారేమో అని కూడా చెక్ చేస్తుంటారని ఆ యువకుడు తెలిపాడు.


ఇంకా భోజన విరామం,లేదా టీ బ్రేక్ సమయంలో కూడా కనీసం 30 నిమిషాలు విరామం కూడా లేకుండా పని చేయాలని, అలా చేసినా కూడా రోజుకు నాలుగు ట్రక్కుల కంటే ఎక్కువ దించలేమని అతను తెలిపాడు. అయినా కూడా పనిని మరింత పెంచాలని సీనియర్లు బాగా ఒత్తిడి తీసుకువస్తుంటారని, వారు అనుకున్న పని పూర్తి చేసే దాకా కనీసం నీరు తాగడానికి, వాష్‌రూమ్ వంటి వాటికి కూడా వెళ్ళమని తమ చేత వాగ్దానం చేయించారని అతను తెలిపాడు. ఇంకా అలానే మహిళలు కూడా తమలాగే ఇబ్బందులు పడుతున్నారని తెలిపాడు. అక్కడ పని చేసే ప్రదేశంలో మహిళలు కనుక అనారోగ్యానికి గురైతే విశ్రాంతి తీసుకునేందుకు కనీసం ప్రత్యేక రూమ్ లు కూడా లేవని పేర్కొన్నాడు. ఎవరైన మహిళలు కనుక అనారోగ్యానికి గురైతే.. వాష్‌రూమ్ లేదా లాకర్ రూమ్‌లో ఉండాల్సి వస్తుందని అతను అన్నాడు.ప్రతి రోజు కూడా ఏకంగా తొమ్మిది గంటలు నిలబడే పని చేయాలని, పనిచేసే కార్మికులకు కనీస సదుపాయాలు లేవని ఆ యువకుడు వాపోయాడు. ఇక ఈ కామెంట్స్ పై అమెజాన్ ఇండియా సంస్థ అధికారులు కూడా స్పందించారు. అయితే ఇలాంటి కఠినమైన నిబంధనలు ఎప్పుడూ పెట్టలేదని, ఒక వేళ మాకు తెలియకుండా ఇలాంటివి జరుగుతున్నాయా అనే విషయంపై ఖచ్చితంగా విచారణ చేస్తామని తెలిపారు. ఇక ఆ కార్మికులు చెప్పింది కనుక నిజమైతే అలాంటి నిబంధనలను పూర్తిగా నిలిపివేస్తామని వారు అన్నారు.ఇక తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని కూడా వెల్లడించారు. మొత్తంగా ఈ ఇష్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: