Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 5696 పోస్టులు విడుదల..!!

Divya
చాలా మంది నిరుద్యోగులు సైతం కచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం సాధించాలని పట్టుదలతో దూర ప్రాంతాలకు వెళ్లి మరి చదువుకుంటున్నారు.. అయితే ఇంత శ్రమ పడుతున్న సరైన నోటిఫికేషన్లు మాత్రం విడుదల కాలేదు.. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏవో ఒక నోటిఫికేషన్లను విడుదల చేస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు రైల్వే లో అసిస్టెంట్ లోకో పైలట్..(ALP) పోస్టులను సైతం భర్తీ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ని కూడా విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చట అందుకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

మొత్తం ఖాళీలు ఉండే సంఖ్య..5696 పోస్టులు కలవు. ఇందులో రీజియన్ల వారీగా ఖాళీలు కలవు.. సికింద్రాబాద్లో 758 పోస్టులు సౌత్ సెంట్రల్ రైల్వేలో 558 పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది.
విద్యార్హత:
ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.. లేకపోతే మెకానిక్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో మూడేళ్లపాటు డిప్లమా ఆయన చేసి ఉండాలి.. లేకపోతే AICITY లో గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి ఇంజనీరింగ్ ని పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చట.

దరఖాస్తు ఫీజు:
ఎస్సీ ఎస్టీ EBC, ఎక్స్ సర్వీస్ మెన్ మహిళలకు మాత్రం రూ.250.. ఇతరులకు రూ .500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు.

వయస్సు:
1-7-2024 నాటికి 18 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి..

జితబత్యాలు:
నెలకు రూ.19,900 నుంచి రూ.63,200  రూపాయలు.
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తో పాటు మెరిట్ ,మెడికల్ ,ఫిట్నెస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత అభ్యర్థుల ఎంపిక చేస్తారట.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ..20-1-2024
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ..19-2-2024
అప్లై చేసుకోవాలనుకుని నిరుద్యోగులు సైతం..www.indianrallways.gov.in వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోవాలి.. రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారీకి ఇది గుడ్ న్యూస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: