అడవి మధ్యలో ఆగిన బత్తాయి ట్రక్కు.. అంతలో అక్కడికొచ్చిన ఏనుగులు.. చివరికి?

praveen
మనుషులే కాదు జంతువులు కూడా ఏకంగా మనుషుల్లాగానే కావాల్సింది దక్కించుకోవడానికి ఏం చేయడానికి అయినా సిద్ధపడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ఆహారాన్ని దక్కించుకోవడం కోసం  ఇతర జంతువుల పై దాడి చేయడం చేస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఏకంగా మనుషులపై కూడా దాడి చేయడం చూస్తూ ఉంటాయ్. అయితే ఏనుగులు ఇలా ఆహారాన్ని దక్కించుకోవడానికి దాడి చేయడం విషయంలో ముందు ఉంటాయి అని చెప్పాలి. చూడ్డానికి భారీ ఆకారంతో కనిపించే ఏనుగులు ఇక ఎంతో సౌమ్యంగానే ఉంటాయి.

 కానీ ఏనుగులకు కోపం వచ్చింది అంటే సృష్టించే విధ్వంసం అంతా కాదు. ఏకంగా అడవికి రారాజు అయిన సింహాన్ని సైతం ప్రాణ భయంతో పరుగులు పెట్టిస్తూ ఉంటాయి ఏనుగులు. అదే ఏనుగులు మనుషులపై దాడి చేస్తే ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. అయితే ఇప్పుడు ఏనుగుల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు కదా.. ఇటీవల ఏకంగా ఏనుగులు చేసిన పని కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది.

 ఏకంగా బత్తాయి లోడుతో వెళ్తున్న ఒక పెద్ద ట్రక్కు అడవి మధ్యలో ఆగిపోయింది. ఈ క్రమంలోనే ట్రక్కులో ఉన్నవారు ఇక ఏం జరిగిందో చూసి రిపేర్ చేస్తూ ఉన్నారు. అంతలో అక్కడికి ఒక భారీ ఏనుగుల గుంపు వచ్చింది. ఈ క్రమంలోనే కళ్ళ ముందు బత్తాయి పళ్ళు కనిపించడంతో ఆ ఏనుగులు అన్నింటికీ కూడా నోరూరిపోయింది. ఈ క్రమంలోనే ఒకవైపు ఇక అక్కడ సిబ్బంది రిపేర్ చేస్తుండగానే ఏనుగుల గుంపు ఇక తమ తొండంతో ట్రక్కులోని బత్తాయిలు అన్నింటిని కూడా ఆరగించడం మొదలుపెట్టాయి. ఎక్కడ తమపై దాడి చేస్తాయో అని ఆ ట్రక్ లో ఉన్నవారు కూడా ఆ ఏనుగులను ఏమీ అనలేదు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: