వైరల్ : తండ్రి చేసిన చిన్న పొరపాటు.. కూతురు ప్రాణం తీసింది?
తండ్రి చేసిన చిన్న నిర్లక్ష్యం ఏకంగా అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని కానరాని లోకాలకు వెళ్లేలా చేసింది. తెలిసీ తెలియని వయసులో చాక్లెట్ కావాలనే ఆత్రుత ఆ చిన్నారి తల్లి చేసిన పని దేవుడి దగ్గరికి పంపించింది. అప్పుడు వరకు తండ్రితోనే ఎంతో హాయిగా కలిసి నవ్వుతూ కనిపించింది చిన్నారి. కేవలం నిమిషాల వ్యవధిలోనే విగతజీవిగా మారిపోయింది. ఐస్ క్రీమ్ కావాలి అంటూ ఫ్రిడ్జ్ పైన కు ఎక్కిన చిన్నారి కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది.
గ్రీష్మ అనే నాలుగేళ్ల చిన్నారి తన తండ్రి విశాల్ కులకర్ణి తో కలిసి ఐస్క్రీమ్ తెచ్చుకునేందుకు ఇంటి పక్కనే ఉన్న షాప్ కి వెళ్ళింది. అయితే ఇక షాప్ బయట ఉంచిన ఫ్రిజ్ చూడగానే తండ్రిని వదిలేసి దానిపైనకు ఎక్కింది ఆ చిన్నారి. కానీ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది. ఆ సమయంలో తండ్రి కూతుర్ని గమనించకుండా ఫోన్ లో మాట్లాడుతూ ఉండటం గమనార్హం. కాసేపటి తర్వాత చూస్తే ఫ్రిజ్ పక్కన స్పృహతప్పి పడిపోయింది చిన్నారి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందిందని తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదు అనే విషయాన్ని జీర్ణించుకోలేక పోయిన తండ్రి గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.