వైరల్ : భారీ డిస్కౌంట్ తో చికెన్ సేల్.. తరువాత షాక్?

Purushottham Vinay
ఇక ఆ వ్యక్తి ప్రతీసారి కూడా కళ్లు చెదిరే డిస్కౌంట్‌తో చికెన్ విక్రయించేవాడు. అలాగే స్థానికంగా ఉండే మిగిలిన షాపులలో కూడా అంతటి భారీ డిస్కౌంట్లు జనం ఎప్పుడూ చూడలేదు.మొన్న బక్రీద్ పండుగ నాడు కూడా చికెన్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించాడు ఆ సదరు వ్యక్తి. అంతే! ఇక ఇంకేముంది అతడి షాప్ క్షణాల్లో హౌస్‌ఫుల్ అయింది. సీన్ కట్ చేస్తే.. ఆ తర్వాత ఈ సేల్స్ వెనుక అంతర్ధానం తెలుసుకున్నారు అక్కడున్న మిగతా వ్యాపారస్తులు అందరూ.. ఇంతకీ అక్కడ జరిగిన ఆ కథేంటంటే.?పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని వట్టంకులం అనే ప్రాంతంలో 31 ఏళ్ళ అఫ్సల్ స్థానికంగా చికెన్ షాప్ నడుపుతున్నాడు. ప్రతీసారి తన షాప్‌కు వచ్చిన కస్టమర్లకు అదిరిపోయే డిస్కౌంట్లతో చాలా తక్కువ ధరకే చికెన్ ని విక్రయిస్తూ వచ్చాడు. బక్రీద్ ఫెస్టివల్ సమయంలో కూడా రూ. 10 నుంచి రూ. 20 వరకు చికెన్‌పై డిస్కౌంట్ ని ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా అఫ్సల్ షాప్ బాగా రద్దీగా మారగా.. స్థానికంగా ఉండే మిగతా చికెన్ షాపులు కూడా పాపం విలవిలలాడాయి.


ఇక అసలే తక్కువ ధరలు.. ఆపై కళ్లు చెదిరే మంచి డిస్కౌంట్లు.. అయినా కూడా అఫ్సల్‌కు లాస్ ఎందుకు రావట్లేదు. లాభాలు ఎలా వచ్చి పడుతున్నాయని మిగతా షాప్ యజమానులకు బాగా డౌట్ వచ్చింది. దీనితో వారంతా కూడా కలిసి కూపీ లాగగా.. ఇక్కడ అసలు విషయం బయటపడింది. అక్కడ రిమోట్ కంట్రోలర్ ద్వారా తన తూకాన్ని తారుమారు చేస్తూ.. కస్టమర్లను అఫ్సల్ మోసం చేస్తున్నాడని వారు గుర్తించారు. అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని వారు పోలీసులకు అప్పగించారు.కాగా, అఫ్సల్‌పై కేసుని నమోదు చేసిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కూడా చేపట్టారు. స్థానిక వ్యాపారస్తులు ఎవరైనా కానీ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారా.? లేదా.? అనే విషయాలను పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. అలాగే ఇలాంటి మోసపూరిత చర్యలకు కనుక పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వ్యాపారస్తులను పోలీసులు హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: