రాక్షసానందం అంటే ఇదేనేమో.. ఎలా ప్రాణం తీశారో చూడండి?

praveen
నేటి ఆధునిక సమాజంలో మనుషుల్లో మానవత్వం పూర్తిగా చచ్చిపోయింది . అయితే ఈ  మాట ఎవరో చెబుతున్నది కాదు నేటి రోజుల్లో మనుషులు ప్రవర్తిస్తున్న తీరు వెలుగులోకి వస్తున్న ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. ఒకప్పుడు ముక్కు మొఖం తెలియని మనుషులకు చిన్న కష్టం వస్తే అయ్యో పాపం అంటూ తల్లడిల్లిపోయే వారు మనుషులు. కానీ ఇప్పుడు మాత్రం మనిషి పక్కనే ప్రాణాలు కోల్పోతున్న కూడా చూసీచూడనట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. మరి కొంతమంది అక్కడ ఏదో  వింత జరుగుతుంది అన్నట్లుగా సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్నారు తప్పక సహాయం చేయడానికి మాత్రం ముందడుగు వేయడం లేదు.

 మరికొంతమంది సహాయం చేయడం దేవుడెరుగు ఏకంగా సాటి మనుషుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ దారుణంగా ప్రాణాలు తీస్తున్నారు. ఇంకొంతమంది మూగజీవాల పట్ల రాక్షసులుగా మారి పోయి ప్రాణాలను గాల్లో కల్పిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ  వెలుగులోకి వచ్చిన ఘటన ఈ కోవకు చెందిందే అని చెప్పాలి. ఇటీవల కాలంలో మనుషులు జంతువులను చిత్రహింసలకు గురి చేసి ప్రాణాలు తీస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇటీవలే నాగాలాండ్ ల్యాండ్ లో ఒక పక్షిని చిత్రహింసలకు గురి చేశారు. గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ అనిపించుకునే పక్షిని కొందరు వ్యక్తులు పట్టుకున్నారు.

 చివరికి ఆ పక్షి ప్రాణం తీసేసారూ. అయితే ఆ పక్షి ప్రాణాలు తీయడానికి ముందు పక్షిని చిత్రహింసలకు గురి చేసిన తీరు మాత్రం ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది. బలమైన కర్రలతో ఆ పక్షి తలపై కొట్టడంతో అది ఒక్కసారిగా పడిపోయింది. తర్వాత దాని మెడ పై  గట్టిగా తొక్కారు. ఆ తర్వాత మరో కాలును ఛాతీ పై పెట్టి దాని ప్రాణాలను గాల్లో కలిపేశారు.. నాగాలాండ్ లోని ఓక జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. వీడియో వైరల్ గా మారగా ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: