ఇక వేసవి వచ్చిందంటే చాలు అందరి చూపు మామిడి పండువైపే.. పండ్లకు రారాజు మామిడిపడుని ఇష్టపడని పడని వారు ఇక బహు అరుదు. అయితే ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం గడికోట గ్రామంలో వినూత్నమైన మామిడి రకాన్ని పండిస్తున్నాడు ఓ రైతు.ఇక కేవలం జపాన్లో మాత్రమే పండే ఆపిల్ మ్యాంగో సాగును అతను చేపట్టాడు. కశ్మీర్ ఆపిల్ను పోలి ఉండే ఈ మామిడి రకాన్ని చాలా ప్రయోగాత్మకంగా పండిస్తున్నాడు. రెడ్ మ్యాంగోగా చెప్పే ఈ మామిడి పండ్లను ఎంతో ఇష్టంతో సాగు చేస్తున్నానంటునంటున్నాడు ఈ రైతు వెంకటేశ్వరరావు. తెలంగాణలోని నర్సాపురం నుంచి ఈ మొక్కలను తీసుకొచ్చి సాగు చేస్తున్నానని ఆయన తెలిపాడు. బహిరంగ మార్కెట్లో ఈ ఆపిల్ మ్యాంగో ధర వచ్చేసి కిలో ఐదొందల నుంచి వెయ్యి రూపాయలు ఉంటుందని చెబుతున్నాడు రైతు వెంకటేశ్వరరావు.జపాన్ దేశానికి చెందిన ఈ మామిడి పండ్లు ఇక అచ్చం కశ్మీర్ ఆపిల్ను పోలి ఉన్నాయి. ఇక అంతేకాదు, ఈ ఆపిల్ మ్యాంగో స్పెషాలీటిస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి.
అలాగే షుగర్ కంటెంట్ తక్కువ ఇంకా ఫైబర్ అధిక శాతం ఉంటుందని చెబుతున్నాడు రైతు వెంకటేశ్వరరావు. ఈ రెడ్ మ్యాంగ్ ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుందని అంటున్నాడు. అయితే,ఇక ఇది అన్ని రకాల మామిడి రకాల్లా కాకుండా ఒక్కో చెట్టుకు 25 నుంచి 30 కేజీల వరకు దిగుబడి వస్తుందని, పైగా ఆ ధర కూడా ఎక్కువగా ఉండటంతో మంచి లాభసాటిగా ఉందని కూడా చెబుతున్నాడు. ఎలాంటి కెమికల్స్ అనేవి వినియోగించకుండా రెడ్ మ్యాంగో సాగు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు రైతు వెంకటేశ్వరరావు. గోపంచకం, ఆవు పేడను ఎరువుగా మార్చి ఇక ఆపిల్ మ్యాంగోను పండిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేయడమే కాకుండా కొత్త రకం మామిడిని కూడా పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు ఈ రైతు వెంకటేశ్వరరావు.