రూ.35/- కోసం పోరాటం.. 3 లక్షల మందికి లబ్ది.. రైల్వే శాఖ దిగోచ్చేలా చేశాడు!

Purushottham Vinay
ఇక మీరెప్పుడైనా రైల్వే టికెట్ ఇంకా బస్సు టికెట్ తీసుకున్న తరువాత తిరిగి చిల్లర ఇవ్వకపోతే నిలదీసి అడిగారా?..ఖచ్చితంగా అడిగే ఉంటారు లేండి.. రూ. 50 పైన ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా అడిగి ఉంటారు. అదే ముప్పై ఇంకా నలబై రూపాయలు అయితే.. వాళ్లు చిల్లర ఇచ్చే సమయం దాకా వేచి ఉండలేక పోతేపోనీలే అని తిరిగి వచ్చేస్తాం. కానీ ఇక్కడ ఆ వ్యక్తి అలాకాదు.. రైల్వే శాఖ నుంచి రావాల్సిన రూ.35 కోసం ఐదేళ్లుగా పోరాటం కూడా చేశాడు. చివరకు రైల్వే శాఖ దిగొచ్చేలా అతను చేశాడు. ఆ వ్యక్తి ఐదేళ్ల పోరాటం వల్ల అతనికి రావాల్సిన రూ.35లతో పాటు అలాగే మరో సుమారు 3లక్షల మందికి సర్వీస్ చార్జి సొమ్మును రైల్వే శాఖ తిరిగిచ్చేలా చేశాడు. ఇంతకీ రూ.35 కోసం ఏకంగా ఐదేళ్లు పోరాటం చేసిన వ్యక్తి ఎవరు? ఎందుకు అంత పట్టుదలతో అతను పోరాటం చేశాడంటే..రాజస్తాన్ కు చెందిన సుజీత్ స్వామి అనే ఓ ఇంజనీర్ రైల్వే నుంచి తనకు రావాల్సిన 35 రూపాయలను ఐదేళ్ల పాటు పోరాడి మరీ దెబ్బకు సాధించుకున్నాడు. 2017 వ సంవత్సరం జులై 2వ తేదీన కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు 2017 ఏప్రిల్ నెలలో అతను టికెట్ బుక్ చేసుకున్నాడు. తర్వాత దానిని రద్దు చేసుకున్నాడు. ఇక జూలై1 నుంచి జీఎస్టీ అమల్లోకి రావడంతో క్యాన్సలేషన్ లో భాగంగా 35 రూపాయల సర్వీస్ చార్జిని కూడా ఆ టికెట్ డబ్బుల్లో నుంచి రైల్వేశాఖ కట్ చేసుకుంది. అయితే తనకు రావాల్సిన ఆ రూ.35 ఎందుకు కట్ చేసుకున్నారంటూ రైల్వే అధికారులను సుజీత్ స్వామి ప్రశ్నించారు.


జీఎస్టీ అమల్లోకి రావటంతో కట్ చేసుకున్నామని వారు బదులిచ్చారు. నేను టికెట్ ని బుక్ చేసుకుంది ఏప్రిల్ నెలలో జీఎస్టీ అమల్లోకి వచ్చింది జులై నెల 1 నుంచి.. అలా ఎలా కట్ చేసుకుంటారు అంటూ నిలదీశాడు.ఇక రైల్వే అధికారులు సరియైన సమాధానం ఇవ్వకపోవటంతో సుజీత్ స్వామి న్యాయ పోరాటానికి దిగాడు. అప్పటి నుంచి ఆర్టీఐ కింద అతను ఏకంగా 50 దరఖాస్తులు పెట్టడంతో పాటు నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలపై లేఖలు కూడా రాశాడు. వరుసగా సోషల్ మీడియా పోస్టులు చేశాడు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను ఇంకా అలాగే జీఎస్టీ కౌన్సిల్ ను టాగ్ చేశాడు.2019 వ సంవత్సరంలో సుజీత్ స్వామి పోరాటానికి దిగొచ్చిన రైల్వే శాఖ తన సొమ్మును రీఫండ్ చేస్తామని తెలిపింది. అయితే సుజీత్ స్వామికి రూ.35 రావాల్సి ఉంటే కేవలం రూ. 33 మాత్రమే రీఫండ్ చేసింది. దీంతో మళ్లీ రైల్వే అధికారుల తీరుపై అతను పోరాటానికి దిగాడు. నాకు రావాల్సిన రూ. 2 కూడా ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టాడు. అప్పటి నుంచి 2రూపాయలకోసం అతను పోరాటం చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఎట్టకేలకు దిగొచ్చిన రైల్వే శాఖ తనకు చెల్లించాల్సిన 2 రూపాయలను కూడా రీఫండ్ చేసింది. ఇక ఇక్కడ అసలు విషయం ఏమిటంటే సుజీత్ స్వామి ఐదేళ్ల పోరాటం వల్ల 2017 సంవత్సరం జూన్ 2కు ముందు టికెట్లు రద్దు చేసుకున్న సుమారు 2.98 లక్షల మందికి రూ.35 సర్వీస్ చార్జి రీఫ్ండ్ అనేది చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: