వామ్మో..ఇదేం పెళ్ళి రా నాయనా..

Satvika
కాలం మారే కొద్ది కొత్త ట్రెండ్ కూడా పూర్తిగా మారిపొయింది..దాంతో యువత కొత్త ఆలోచనలు కూడా కొత్తగా మారాయి.ఇకపోతే ఇప్పుడు యువత కూడా కొత్త దనాన్ని కోరుకుంటుంటారు.. అందుకే పెళ్ళిళ్ళు కూడా వెరైటీగా చేసుకుంటున్నారు.. అందరి కన్నా బెస్ట్ గా చేసుకోవాలని కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా పెళ్ళి ఊరేగింపు లో పెళ్ళి కూతురు చేసిన పనికి అందరు షాక్ కు గురవుతున్నాయి.మండపంలోకి పెళ్ళి కూతురు ఇచ్చిన ఎంట్రీ చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు..

 
పెళ్ళి దుస్తులు వేసుకొని అందంగా ముస్తాబైన పెళ్ళి కూతురు ట్రాక్టర్ను నడుపుకుంటూ వచ్చింది..అది చూసిన జనం అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు..ఈ వింత ఘటన మధ్య ప్రదేశ్ లో వెలుగు చూసింది.ఏకంగా ట్రాక్టర్ పై పెళ్లి డ్రస్సులో పెళ్లి మండపానికి వచ్చింది. అప్పటి వరకు పెళ్లికూతురు పల్లకిలో వస్తుందని ఎదురుచూస్తున్న పెళ్లికొడుకు బంధువులు ట్రాక్టర్ తోలుకుంటూ పెళ్లికూతురు రావడంతో ఒక్కసారిగా కంగుతినిపోయారు. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా జావ్రా గ్రామంలో ఓ నవ వధువు ట్రాక్టర్ నడుపుకుంటూ కల్యాణ మండపానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రామానికి చెందిన భారతి తద్గేకు పొరుగూరు యువకుడితో వివాహం నిశ్చయమైంది.

వధువు భారతి తన అన్నదమ్ములిద్దరినీ చెరో పక్కన కూర్చోబెట్టుకుని ట్రాక్టర్ నడుపుకుంటూ మండపానికి చేరుకుంది. పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువు, నల్లని కళ్లద్దాలు ధరించి హుందాగా ట్రాక్టర్ నడుపుకుంటూ మండపానికి వచ్చింది..పెళ్లి కుమార్తె అలా రావడం చూసిన వరుడు సహా పెళ్లికొచ్చిన వారు షాకయ్యారు.నా స్టైలే వేరంటూ ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చిన పెళ్లికూతురు వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇదే విషయంపై వధువు మాట్లాడుతూ.. పల్లకీలోనో, కారులోనో ఎంట్రీ ఇచ్చే ట్రెండ్ పాతబడిపోయిందని, అందుకు భిన్నంగా ఏదైనా చేయాలని అనుకున్నాని చెప్పింది. ఇదిలా ఉంటే గతంలో కూడా ఇలానే ఓ వధవు చేతితో కత్తి పట్టుకుని గుర్రం పై స్వారీ చేసుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే..ఇలాంటి ఘటనలు ఇప్పుడు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి..మొత్తానికి ఇది వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: