వైరల్ వీడియో : పెళ్లి ఊరేగింపు.. భలే కొత్తగా ఆలోచించారు భయ్యా?

praveen
ఒకప్పుడు పెళ్లి వేడుకలు ఎలా జరిగేది అన్నది దాదాపు అందరికీ ఒక అవగాహన ఉంది. కానీ నేటి రోజుల్లో మాత్రం పెళ్లి వేడుకలు విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తున్నారు. జీవితంలో ఒకేసారి చేసుకునే ఒక మధురమైన జ్ఞాపకం కావడంతో పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఆలోచిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు అంగరంగ వైభవంగా ముస్తాబు చేయబడిన పెళ్లి మండపంలో వధూవరులిద్దరు కూడా ఊరేగింపుగా రావడం లాంటివి జరుగుతాయి. ఇక ఇటీవల కాలంలో వధూవరులు ఇద్దరు డాన్స్ చేస్తూ పెళ్లి మండపం లోకి ఎంట్రీ ఇవ్వడం ట్రెండ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇటీవలి కాలంలో మాత్రం మరికొంత మంది ఇంకా వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. దీంతో బయటకు వెళ్లాలంటేనే భయపడి పోతున్నారు జనాలు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక పెళ్లిళ్లు చేసుకోవడం అంటే వామ్మో అంటూన్నారు. ఎందుకంటే పెళ్లి వేడుక అంటే అన్ని రకాల కార్యక్రమాలు ఉంటాయి. దంచికొడుతున్న ఎండలు చూసి అన్ని  రకాల కార్యక్రమాలను నిర్వహించాలంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి సమయంలోనే ఇక్కడ ఓ పెళ్లి ఇంటివారు వినూత్నమైన ఆలోచన చేశారు.

 ఎండలు తీవ్రంగా ఉండడంతో ఇక ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి సరికొత్తగా ఆలోచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పెళ్లి వారూ ఊరేగింపు కొత్త పద్ధతిలో చేశారు. రోడ్డుపై నుంచి లాక్కుని పోయి ఒకటి టెంట్ చేసారూ. చతురస్ర ఆకారంలో ఉన్న టెంట్ కు చక్రాలు అమర్చారు.  నాలుగువైపులా నలుగురు ఉండి ముందుకు నెడుతూ ఉన్నారు. టెంట్ కింద పెళ్లి కొడుకును గుర్రంపై కూర్చోబెట్టి మండపానికి తీసుకుని వెళుతూ ఉన్నారు.  ఇక ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసి ఎంతో మంది ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: