పెళ్ళి చేసుకున్న ఇద్దరు యువతులు.. షాక్ లో కుటుంబ సభ్యులు..
వివరాల్లొకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది..బండాలో స్వలింగ సంపర్కుల వివాహానికి సంబంధించిన సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఇద్దరు బాలికలు పెళ్ళి చేసుకున్నాము అని చెప్పుకొచ్చారు.లక్నో నుండి ఒక బాలికను తీసుకుని వైద్య పరీక్షలు చేసిన తర్వాత దర్యాప్తు ప్రారంభించారు. ఈ అమ్మాయిలిద్దరూ స్నేహితులు అని పోలీసు విచారణలో తేలింది. దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు. అంతేకాదు చాలా కాలంగా ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు.బీఎస్సీ, బీఎల్ఈడీ చదువుతున్నారు.
కుటుంబ సభ్యులు వాళ్ళు కనిపించ లేదు అని పోలీసు స్టేషన్ లో ఫిర్యాధు చేశారు.దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. అమ్మాయిను పట్టుకున్నారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు స్టేషన్ కు తీసుకొచ్చారు.అమ్మాయిల ప్రేమ వ్యవహారం తెలిసిన వెంటనే వారి కుటుంబసభ్యులు కూడా షాక్ అవుతున్నారు. ఇప్పుడు ఇద్దరి బంధువులు ఒకరితో ఒకరు జీవించవద్దని వారిని ఒప్పిస్తున్నారు. అలా చేయడం తప్పు అని వివరంగా చెబుతున్నారు. ఢిల్లీలోని ఆర్యసమాజ్ మందిర్లో వివాహం చేసుకున్నామని చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ మాత్రం వారు చూపలేదు. దాంతో పోలీసులు పూర్తిగా వివరాలు సెకరించె పనిలో వున్నారు.ఏది ఏమైనా ఇప్పుడు ఇది సంచలనంగా మారింది...