వైరల్: భార్య రాక్షసత్వానికి.. బరువు తగ్గిన భర్త.. ఏకంగా అన్ని కిలోలా..?

Divya
సాధారణంగా భర్తలు..భార్యలను క్రూరంగా హింసించే వారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇటీవల కాలంలో భార్య భర్తలను అత్యంత దారుణంగా హింసిస్తున్నారు అని కొంతమంది భర్తలు కోర్ట్ ను ఆశ్రయిస్తున్న రోజులు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. ఇకపోతే ఒక భార్య క్రూరత్వాన్ని భరించలేక ఆమె భర్త ఏకంగా 21 కేజీల బరువు తగ్గాడట. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆ వ్యక్తికి విడాకులు మంజూరు చేసి, ఆ భార్య నుంచి విముక్తి కలిగించింది.
ఆ వ్యక్తి 50% వినికిడిలోపంతో బాధపడుతున్నాడు. అతని భార్య వేధింపులు తట్టుకోలేక ..అందుకే ఆ వ్యక్తి కోర్టులో విడాకుల కోసం ఆశ్రయించగా, హిసార్ లోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేస్తున్నట్లు తీర్పు చెప్పింది. అయితే ఆమెకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేక ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను ఆమె వ్యతిరేకిస్తూ,  దాఖలు చేసిన అప్పీల్ ఇటీవల హైకోర్టు కూడా తాజాగా కొట్టివేయడం జరిగింది. ఆ వ్యక్తి 74 కిలోల నుంచి ఏకంగా యాభై మూడు కిలోల వరకు బరువు తగ్గాడట. మానసిక క్షోభకు గురైన ఆ వ్యక్తి ఏకంగా 21 కేజీలు బరువు తగ్గడం.. ఇది చాలా నేరమని హైకోర్టు భావించి, ఆమె చేసిన క్రిమినల్ ఫిర్యాదులు, కేసులు అన్నీ కూడా అబద్ధమని తేల్చింది.

భార్య క్రూరత్వం కారణంగా బాధితుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు గుర్తించిన కోర్టు, మానసిక క్రూరత్వానికి  సమానమని కోర్టు  తీర్పులో పేర్కొనడం జరిగింది. ఇక  ప్రముఖ న్యాయవాది జస్టిస్ రీతు బ్రహ్మ, జస్టిస్ అర్చన పూరీల తో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పు నివ్వడం జరిగింది.. ఇకపోతే 2019 సంవత్సరం ఆగస్టు 27వ తేదీన బాధితుడి పిటిషన్ ను విచారించిన ఫ్యామిలీ కోర్టు, ఇటీవల విడాకులు మంజూరు చేసింది. ఇదిలా ఉండగా 2012 ఏప్రిల్ లో వీరికి పెళ్లి జరిగింది. ఒక కుమార్తె కూడా జన్మించింది.ఆమె హిసార్ లోని ఒక ప్రైవేటు పాఠశాలలో ప్రైవేట్ టీచర్ గా పని చేస్తుండ,గా అతను బ్యాంకు ఉద్యోగి గా పని చేస్తున్నాడు. ఇక విడాకుల అనంతరం ఆ పాప తన తండ్రితో నివసిస్తుందని కోర్టు తీర్పునివ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: