వైరల్ : ఈ కుంభకర్ణుడు గురించి మీకు తెలుసా..?
ప్రారంభంలో 18 గంటల పాటు అతను పడుకుని నిద్రపోయేవాడని తెలియజేశాడు. అయితే రాను రాను నెలలో 5 నుంచి 7 రోజుల పాటు నిద్రపోవాల్సి వచ్చిందని, ఆ తర్వాత నెలలో 20 నుంచి 25 రోజుల పాటు నిద్రపోయేవాడని తెలిపాడు. ఇలా ఏడాదికి సుమారుగా అంటే 300 రోజుల పాటు నిద్రలోనే ఉండేవాడని పేర్కొన్నాడు. పూర్జారామ్ భార్య లిచ్మి దేవి మాట్లాడుతూ.. తన భర్త అనారోగ్యం వల్ల తనకు ఎన్నో సమస్యలు వచ్చాయని బాధపడింది. తన భర్త ఇలా నిద్రపోవడం తనకు ఎంతో ఇబ్బందిని కలిగించిందని తెలిపింది. ఎవ్వరి దగ్గరకు వెళ్లినా కూడా తన భర్త ప్రాబ్లమ్ ఏంటో ఎవ్వరూ చెప్పేవారు కాదని, కొందరు డాక్టర్లు అయితే తన భర్తకు ఉన్న వ్యాధి హైపర్సోమ్నియా అని చెప్పారని తెలిపింది. తన భర్త సంవత్సరంలో ఇలా నిద్రపోతూనే ఉంటాడని, అందుకే ఆయన్ని అందరూ కుంభకర్ణుడు అని పిలుస్తున్నట్లు తెలియజేసింది.