ఇప్పటికి అందరికి కూడా బచ్పన్ కా ప్యార్ బాయ్, సహదేవ్ డిర్డో గురించి బాగా తెలిసి ఉండవచ్చు, అతను రాత్రికి రాత్రే వైరల్ సెన్సేషన్ అయ్యాడు. చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాకు చెందిన ఈ 10 ఏళ్ల బాలుడు సహదేవ్ డిర్డో తన ఉపాధ్యాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 2019 పాట వెర్షన్తో బాగా వైరల్ అయ్యాడు. సహదేవ్ తన స్కూల్ యూనిఫాంలో బచ్పన్ కా ప్యార్ పాట పాడడాన్ని చూడవచ్చు. అప్పటి నుండి, సహదేవ్ డిర్డో ఇంటర్నెట్లో ట్రెండింగ్ లో ఉన్నాడు.ఇంకా అతను తన టాలెంట్ తో రాజకీయ నాయకులు, నటులు ఇంకా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకోగలిగాడు. ఇక అతను మంచి పాపులరిటీ దక్కించుకొని చాలా దూరం వచ్చాడు. ఇండియన్ ఐడల్ 12 లో ప్రత్యేక అతిథిగా ఆహ్వానించబడ్డాడు. బాద్షా, ఆస్థా గిల్ ఇంకా రికోతో కలిసి ఈ చిన్నారి వీడియో మ్యూజిక్ వీడియోలో పాల్గొన్నాడు. అతడిని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ కూడా సన్మానించారు. అయితే, ఇటీవల రూ. 23 లక్షల విలువైన సరికొత్త ఎంజి హెక్టర్ కారు ముందు నిలబడి ఉన్న వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
వీడియోలో సహదేవ్ డిర్డో కారు ముందు భాగంలో పోజులివ్వడాన్ని చూడవచ్చు. ఎంజి మోటార్ నుండి ఒక అధికారి చిన్నవాడిని అభినందించడాన్ని చూడవచ్చు. వీడియో పురోగమిస్తున్నప్పుడు, ఒక సేల్స్ గర్ల్ అతని పక్కన ఒక పెద్ద కారు కీతో నిలబడి ఉండటం మనము చూశాము. దీని తర్వాత, నెటిజన్లు కారు అతనికి బహుమతిగా ఇచ్చారని భావించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అయితే, వీడియోలో మీరు చూసేది నిజం కాదు.ఎంజి మోటార్ సహదేవ్ డిర్డోకి కారు ఇవ్వలేదని చెప్పాడు. బదులుగా, అతను వారి డీలర్షిప్ స్టోర్లో ఒక కార్యక్రమానికి ఆహ్వానించబడ్డాడు. “మేము ఎవరికీ వాహనం ఇవ్వలేదు. మా కారు ఒకటి కస్టమర్కు బట్వాడా చేయబడుతున్న సమయంలో మేము బాలుడిని డెలివరీ ఈవెంట్ కోసం ఆహ్వానించాము "అని ఎంజి మోటార్ కంపెనీ హెడ్ చెప్పారు. బచ్చన్ కా ప్యార్, ఈ 10 ఏళ్ల ఛత్తీస్గఢ్ బాలుడిని ప్రసిద్ధి చేసిన పాట, నిజానికి 2019 లో ఈ పాట విడుదలైంది. ఈ పాటని కమలేష్ బారోట్ వంచించారు.