పెళ్లి కొడుకుని చెప్పుతో కొట్టిన తల్లి...

Purushottham Vinay
చల్లగా నిండు నూరేళ్లు కలిసి బ్రతకండని అక్షింతలు వేసి కొత్త జంటను ఆశీర్వదించాల్సిన పెళ్లి కొడుకు తల్లి.. అతనిపై చెప్పు విసిరింది.ఇక అంతే.. అప్పటి దాకా ఎంతో ప్రశాంతంగా సాగుతున్న పెళ్లిలో పెద్ద రచ్చ నెలకొంది. ఇక కాసేపటి తరువాత అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆమె పెళ్లి కొడుకుపై చెప్పు ఎందుకు విసిరింది? అసలేం జరిగిందనే విషయానికి వస్తే..ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని హమీర్‌పూర్ జిల్లాలోని భురువా సుమెర్పూర్ అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోవడం జరిగింది. ఇక వేదిక మీద పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా చాలా ఘనంగా సాగుతోంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక వరమాలలు మార్చుకున్న తర్వాత..తామర పువ్వు ఆకారంలో గుండ్రంగా తిరుగుతున్న స్టేజ్ మీద కూర్చున్నారు. ఇంతలోనే ఓ మహిళ మెట్లు ఎక్కుతూ ఆ స్టేజ్ వద్దకు వచ్చింది. వెంటనే తన చెప్పు తీసి వరుడి మీదకు విసింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా అవ్వక్కయ్యారు.

ముఖానికి ముసుగు వేసుకుని ఉండటం వల్ల ఆ మహిళ ఎవరో తెలియలేదు.ఇక ఈ సంఘటన జరగగానే కొందరు ఆమెను బలవంతంగా స్టేజ్ మీద నుంచి కిందికి దించేయడం జరిగింది.ఆ మహిళ మరెవరో కాదట .. సాక్షాత్తు ఆ పెళ్లి కొడుకు తల్లేనని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే, కొత్త దంపతులను ఆశీర్వదించాల్సిన ఆమె ఎందుకలా చేసిందో అర్థం కాలేదు.పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు సమాచారం ప్రకారం.. కొడుకు వేరే కులానికి చెందిన అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం ఆమెకు అస్సలు ఇష్టం లేదట. దీంతో ఆమె కొడుకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు.ఇక అప్పటి నుంచి అతడు ఆ యువతితోనే కాపురం చేస్తున్నాడట. అయితే పెళ్లికూతురు తండ్రి తన కూతురి పెళ్లిని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. డిస్ట్రిక్ట్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెళ్లి కొడుకు కుటుంబికులను కూడా ఆయన ఆహ్వానించాడు. దీంతో పెళ్లి కొడుకు తల్లి ఆ వేదిక వద్దకు వచ్చి కొడుకు మీద ప్రతీకారం తీర్చుకుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు ఆమెను తెగ తిట్టిపోస్తున్నారు. కులపిచ్చితో కొడుకు ఇష్టాన్ని అర్థం చేసుకోలేని నువ్వు తల్లివేనా? అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: