క్రియేటివిటీ పీక్స్ అంటే ఇదేనేమో.. ఫోటో వైరల్?
ఇక కొన్ని కొన్ని సార్లు ఇలా ఫొటోలు వీడియోలలో కొంతమంది చూపించే క్రియేటివిటీకి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇలాంటి ఆలోచన అసలు వాళ్ళకి ఎలా వచ్చిందబ్బా అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఫోటో చూసిన అదే అనిపిస్తుంది. సాధారణంగా ఇప్పటివరకు న్యూస్ రిపోర్టింగ్ చేసే వాళ్ళని అందరూ చూసే ఉంటారు. న్యూస్ రిపోర్టింగ్ చేయాలి అంటే ఒక యాంకర్ తో పాటు ఒక కెమెరా మెన్ కూడా ఉండాలి కొన్ని కొన్ని సార్లు వారికి అసిస్టెంట్లు కూడా అవసరం ఉంటుంది. ఇలా కొంతమంది ఒక గ్రూపు కలిస్తేనే రిపోర్టింగ్ చేసేందుకు వీలు అవుతుంది అని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం రిపోర్టింగ్ లో సరికొత్త క్రియేటివిటీని చూపించింది. కెమెరామెన్ అక్కర్లేకుండా ఎలాంటి అసిస్టెంట్ లేకుండానే రిపోర్టింగ్ చేస్తూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
యువతి క్రియేటివిటి చూసి అటు నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ యువతి ఏం చేసిందంటే ఇక తన సెల్ఫోన్ కి సెల్ఫీ స్టిక్ పెట్టుకుంది. సెల్ ఫోన్ కి తన మైక్ కనెక్ట్ చేసుకుంది. ఇంకా ఎంతో సునాయాసంగా సెల్ఫీ తీసుకున్నట్లుగా ఫోన్ ముందుకు పెట్టి ఇక మైక్ నోటి దగ్గర పెట్టుకొని రిపోర్ట్ ఇస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన నెటిజన్లు అరే ఏం క్రియేటివిటీ.. ఖర్చు తక్కువ క్వాలిటీ ఎక్కువ అంటూ కామెంట్ సైతం పెడుతున్నారు. ఈ ఫోటో చూసిన వారు ఇంత సింపుల్ గా రిపోర్టింగ్ కూడా చేయవచ్చా అని ఆశ్చర్యపోతున్నారు.