నెట్టింటా వైరల్ అవుతున్న పాల నది....
లాన్వర్డా, కార్మర్థెన్షైర్ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ అరుదైన దృశ్యం కనిపించింది. దులైస్ నది ఒక్కసారే తెల్లరంగులోకి మారిపోవడంతో అంతా షాకయ్యారు. ఆ నదిలో నీటిని ముట్టుకుని చూస్తే.. అవి పాలని తెలిసింది. అదేంటీ నదిలోకి అన్ని పాలు ఎలా వచ్చాయి? ఇదేమీ ప్రళయానికి సంకేతం కాదు కదా అని ‘హాలీవుడ్’ రేంజ్లో ఆలోచించారు. అసలు కారణం తెలుసుకోడానికి ప్రయత్నించారు.
ఇక అది స్వర్గం లో ఉండే ఏ పాల నదో కాదండి.. అసలు విషయం ఏమిటంటే ఆ నది పక్క నుంచి వెళ్లే మార్గంలో ఓ పాల ట్యాంకర్ బోల్తా కొట్టింది. దీంతో అందులో ఉన్న పాలన్నీ నదిలోకి చేరుకున్నాయి. దీంతో నదిలో నీరంతా తెల్లగా మారిపోయాయి. ఈ విషయం తెలిసి.. "అయ్యో ఏదేదో అనేసుకున్నాం. పాల ట్యాంకు బోల్తా పడిందా’’ అనుకుంటూ దాని గురించి వదిలేసి ఇక తమ పనుల్లో యధావిధిగా మునిగితేలారు. కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వైరల్గా మారిన ఈ వీడియో చూసి నెటిజనులు జోకులు పేలుస్తున్నారు. ఆ నదిలో చేపల ముళ్లు మరింత షార్ప్ గా అలాగే బలంగా మారతాయని జోక్స్ వేస్తున్నారు. మరి కొందరైతే.. నది, అందులో నివసించే చేపలు తదితర జీవులకు పాల వల్ల నష్టం ఉండ వచ్చునని కామెంట్లు చేస్తున్నారు.