Viral Video: యువకుడిని ట్రక్కు బానెట్‌కు కట్టేసి ఊరేగింపు?

Purushottham Vinay
ఇక పంజాబ్‌ రాష్ట్రంలోని ముక్త్‌సర్ జిల్లాలో ఓ యువకుడిని ట్రక్కు బానెట్‌కు కట్టేసి నగరమంతా కూడా ఊరేగించారు. అయితే అతను చేసిన పాపం ఏంటంటే ఆ కదులుతున్న ట్రక్కు నుంచి రెండు గోధుమల బస్తాలను దొంగిలించడమే ఆ యువకుడు చేసిన పాపం అట.అందుకే దీనికి శిక్షగా ఆ యువకుడిని ట్రక్కు బానెట్‌కు కట్టి నగరమంతా ఊరేగించడం జరిగింది. ఆపై పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు కూడా అప్పగించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ విపరీతంగా వైరల్ అవుతోంది . ఈ వీడియోలో ట్రక్ డ్రైవర్ ఇంకా హెల్పర్‌ యువకుడిని ట్రక్కు బానెట్‌కు కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళుతుండడం మనం చూడవచ్చు. ఈ అమానవీయ సంఘటన ఆదివారం నాడు సాయంత్రం పూట అబోహర్ రోడ్డులో జరిగింది. ఇక పోలీసుల నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ఆ యువకుడు కదులుతున్న ట్రక్కు నుండి గోధుమ బస్తాలను దొంగిలిస్తూ పట్టుబడటం జరిగింది. అయితే ఆ ట్రక్ డ్రైవర్ అతడిని పోలీసులకు అప్పగించకుండా ముందుగా ట్రక్కు బానెట్‌కు కట్టేసి ఊరంతా కూడా ఊరేగించాడు. 


ఈ ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పంజాబ్ పోలీసులు రంగంలోకి దిగారు.దీనిపై విచారణ జరిపి ఆ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పంజాబ్ పోలీసులు చెబుతున్నారు.సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోలో యువకుడిని ట్రక్కు బానెట్‌కు కట్టేసి ఉండగా, డ్రైవర్ సహాయకుడు అతడిని పట్టుకున్నట్లు మనం ఈ వైరల్ క్లిప్‌లో చూడవచ్చు. ఇంకా అలాగే ఆ యువకుడు రెండు గోధుమల బస్తాలను దొంగిలించాడని, అందుకే అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నట్లు ఆ హెల్పర్ చెప్పడం కూడా వినవచ్చు. నెట్టింటా వైరల్ అవుతున్న ఈ వీడియో ఆధారంగా ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నామని పంజాబ్ పోలీస్ డీఎస్పీ అయిన జగదీష్ కుమార్ తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఆ దోషులపై ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వ్యాపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: