బుల్లిపిట్ట: చీప్ డెడ్ కే జియో 5G స్మార్ట్ ఫోన్.. ఎప్పుడంటే..?

Divya
రిలయన్స్ జియో.. ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకట్టుకోవడానికి వినూత్నమైన ఫీచర్లతో అధునాతన టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్ ఫోన్స్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తోంది జియో సంస్థ. ఈ క్రమంలోనే తాజాగా ఈ టెలికాం దిగ్గజం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. త్వరలో జియో 5g స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ తో వస్తుందని ప్రకటించింది. 128GB, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ తో రానుంది అని... ఇందులో 16 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ఇక బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే.. 5000 ఎం ఏ హెచ్ బ్యాటరీని కలిగి ఉంటుందని.. అలాగే 33W ఫాస్ట్ చార్జర్ ఉపయోగించి ఈజీగా బ్యాటరీని చార్జ్ చేయవచ్చు అని కంపెనీ తెలిపింది.
ఈ స్మార్ట్ ఫోన్ ను 30 నిమిషాలు చార్జ్ చేస్తే ఫుల్ చార్జ్ అవుతుందట. అంతేకాదు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసామంటే రెండు రోజులు వరకు చార్జింగ్ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే విషయానికి వస్తే.. 5.5 అంగుళాల హెచ్డి డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇందులో సులభంగా 4K వీడియో లు చూడవచ్చు.. ప్రస్తుత కాలంలో అందరూ 5g స్మార్ట్ ఫోన్ కి ఓటు వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 5జి స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. తాజాగా అందుతున్న మీడియా నివేదికల ప్రకారం జూన్ రెండు లేదా మూడవ వారంలో ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
ఇకపోతే లాంచ్  తేదీ సమయంలోనే ఈ స్మార్ట్ఫోన్ సంబంధించిన అన్ని విషయాలు కూడా వెలువడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం దీని ధర కేవలం రూ.3000 వరకు మాత్రమే.. ఏది ఏమైనా హై ఫీచర్లతో తక్కువ ధరకే ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: