బుల్లి పిట్ట: స్మార్ట్ ఫోన్లో విలువైన డేటాను ఎలా సేఫ్ గా ఉంచాలో తెలుసా..?

Divya
టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో అదే స్థాయిలో నేరాలు కూడా పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న టెక్ ప్రపంచంలో వ్యక్తిగత డేటాను సురక్షితంగా ఉంచుకోవడం అత్యంత సులభం కాదని చెప్పాలి.. ఎందుకంటే మీ వ్యక్తిగత సమాచారాన్ని ఏ యాప్ దొంగలిస్తుందో?  ఎక్కడ దానిని చెడుగా ఉపయోగిస్తుందో? చెప్పడం చాలా కష్టం. అందుకే వినియోగదారులు తప్పకుండా తమ స్మార్ట్ ఫోన్లోని పర్సనల్ డేటాను సురక్షితంగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇకపోతే స్మార్ట్ ఫోన్ ను  భద్రంగా ఉంచుకోవడానికి అవసరమైన సెట్టింగ్లను ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ముందుగా మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లయితే దాన్ని సేఫ్ గా ఉంచడానికి ఆపరేటింగ్ సిస్టం కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ తో అప్డేట్ చేయాలి. స్మార్ట్ ఫోన్లో ఏదైనా భద్రతా సమస్య ఉంటే వెంటనే అది పరిష్కరిస్తుంది. ఇక స్మార్ట్ ఫోన్ అప్డేట్ చేయడం వల్ల భద్రతా సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. ఇక కొత్త వెర్షన్ కి అప్డేట్ అయినా వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ మరింత సురక్షితంగా ఉంచుకోవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్ 13 అప్డేట్ చేయకుంటే వెంటనే చేయండి.

ఇక మీ ఫోన్లో ఉన్న కొన్ని అప్లికేషన్లు వ్యక్తిగత సమాచారానికి యాక్సిస్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సమాచారాన్ని ఏ యాప్ యాక్సిస్ చేయగలదో నియంత్రించడానికి కూడా ఒక మార్గం ఉంటుంది. దీనిని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించాలి.  అలాగే గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనేది కూడా మీ పరికరంలో ఏదైనా థ్రెట్ ఉంటే తనిఖీ చేసి మీకు వెల్లడిస్తుంది. స్మార్ట్ ఫోన్ను ఎప్పటికప్పుడు రక్షించేలా చర్యలు తీసుకుంటుంది ఏదైనా ప్రమాదకరమైన అంశాన్ని గుర్తిస్తే వెంటనే ఆ యాప్ ఫంక్షన్ను బ్లాక్ చేసేస్తుంది. ప్రమాదకరమైన అప్లికేషన్లను కూడా అన్ఇన్స్టాల్ చేసేలా మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఇంకా ఫింగర్ ప్రింట్, పిన్, పాస్వర్డ్, ఫ్యాట్రన్ వంటివి ఇతరులకు షేర్ చేయకండి.. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: