బుల్లి పిట్ట:రూ.999 జియో కొత్త 4G మొబైల్..!!

Divya
జియో ఇండియాలో కొత్త 4G మొబైల్ ని విడుదల చేసింది.ఈ మొబైల్ ఫోన్ ని లాంచ్ చేయడం వెనుక జియో కంపెనీ 2g ముక్త భారత్ విజన్ ని సాధించడమే లక్ష్యం అంటూ తెలియజేయడం జరిగింది. జియో కంపెనీ కార్బన్ సంస్థలతో భాగస్వామ్యమయి రెండు జియో భారత్ మొబైల్ మోడల్స్ విడుదల చేయడం జరిగింది. జియో భారత్ ఫోన్లను నిర్మించడానికి ఇతర బ్రాండ్లు త్వరలోనే జియో ప్లాట్ఫారంలో విడుదల చేయబోతున్నట్లు రిలయన్స్ జియో సంస్థ ధృవీకరించడం జరిగింది.

మరింత సరసమైన మొబైల్ లను లాంచ్ చేయడానికి మరికొన్ని బ్రాండ్లు జియో తో కలిసి భాగస్వామ్యం అవుతాయని తాము ఆశిస్తున్నట్లుగా తెలియజేసింది జియో సంస్థ. దాదాపుగా వన్ మిలియన్ యూనిట్లను కలిగి ఉన్న మొదటి సెట్ జియో భారత్ మొబైల్స్ ఈనెల 7 నుంచి సేల్ ప్రారంభం కాబోతోందని తెలియజేశారు. దేశంలో ఉన్నటువంటి రిటైల్ స్టోర్ లలో ఈ మొబైల్స్ అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించడం జరిగింది. కొత్తగా లాంచ్ చేసిన ఈ జియో భారత్ మొబైల్ ఫీచర్ ఫోన్ లాగా కీప్యాడ్ మరియు భారత్ బ్రాండింగ్ తో స్క్రీన్ దిగువన కనిపిస్తుందని తెలియజేస్తోంది.

అయితే ఈ ఫోన్ వెనకాల ప్యానల్ మరియు స్పీకర్లతో కెమెరా కూడా కలదట.. జియో భారత్ ఫోన్ భారతదేశంలో ఎక్కడైనా సరే అపరిమితమైన కాల్స్ చేసుకోవడానికి ఫోటోలు తీయడానికి జియో పే ని ఉపయోగించుకోవచ్చట. ఈ మొబైల్లో జియో సినిమా జియో సావన్, FM, మద్దతుతో అనేక వినోద కార్యక్రమాలు కూడా ప్రసారం కాబోతున్నాయట. ఇక రీఛార్జ్ ప్లాన్లను కూడా లాంచ్ చేయడం జరిగింది . రూ.123 ప్లాన్ చౌకైన దేవత లభిస్తుంది. ఆఫ్ జిపి డేటా 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది అపరిమిత కాల్చిన కూడా అందిస్తుంది. రూ.1234 ప్లాన్ ఏడాది మొత్తం లభిస్తుంది..168 GB డేటాను అందిస్తుంది అపరిమిత కాలింగ్ కూడా కలవట. ఈ మొబైల్ రెండు కలర్లలో లభిస్తుంది. దీని ధర రూ.999 కలదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: